పెద్ద నోట్ల రద్దును తెరపైకి తీసుకువచ్చిన కేంద్రప్రభుత్వం.. ఇది మోడీ సర్కార్ సాహసోపేత నిర్ణయమని వెల్లడించినా.. ఆ తరువాత ఈ ప్రజల నుంచి నోట్ట రద్దు ఎందుకు? అన్న ప్రశ్నకు కూడా పలు సమాధానాలను చెప్పింది. వాటిలో ఒకటి నకిలీ నోట్ల నియంత్రణ. అయితే కొత్తగా కేంద్రం ప్రవేశపెట్టిన కరెన్సీ నోట్లను అక్రమార్కులు ఫేక్ కరెన్సీ సృష్టించవచ్చు కదా.. అన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్రం.. కొత్త కరెన్సీలను పాకిస్థాన్ దేశం నకిలీని చేయడం అసాధ్యమని కూడా చెప్పారు. కానీ అది నిజం కాదని తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
కొత్త నోట్లు విడుదలైన నెల రోజుల నుంచే దేశంలో ఫేక్ కరెన్సీ చెలామణిలోకి రావటం మొదలైందని ఘటనలు దృవపరుస్తున్నాయి. అయితే పాకిస్థాన్ నుంచి దేశీయ వ్యవస్థలోకి వచ్చే నకిలీ నోట్ల సంఖ్య కేంద్రం చెప్పినట్లుగానే తగ్గినా.. మార్గం మార్చుకుని వయా బంగ్లాదేశ్ మార్గం నుంచి వస్తున్నాయి. దీంతో నకిలీనోట్ల విషయంలో పాకిస్థాన్ ను వెనక్కు నెట్టిన బంగ్లాదేశ్ అగ్రస్థానంలో వుంది. అత్యధికంగా రెండు వేల రూపాయల నకిలీ నోట్లను బంగ్లా సరిహద్దు నుంచే స్వాధీనం చేసుకున్నామని సరిహద్దు భద్రతా బలగాలు వెల్లడించాయి.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో ముద్రితమై అక్రమమార్గల ద్వారా దేశంలోని 13 ప్రాంతాలకు వచ్చేవి. వీటిలో 11 ప్రాంతాలు గతంలో చాలాసార్లు వార్తల్లో నిలిచాయి. అయితే అస్సాంలోని గౌహతి, పశ్చిమబెంగాల్ ప్రాంతాలు మాత్రం ఈ యేడాది నుంచే నకిలీ నోట్ల చెలమణికి అడ్డగా మారాయని అధికారులు చెబుతున్నారు.
ఈ యేడాది మొదటి ఆరునెలలో 32 లక్షలను బీఎస్ఎఫ్ దళాలు స్వాధీనపరుచుకోగా.. గతంలో కంటే తక్కువే పట్టుబడింది. ప్రస్తుతం వీటి సంఖ్య తక్కువగానే ఉన్నా రానున్న రోజుల్లో నకిలీ కరెన్సీ ఉధృతం చేసేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సౌదీ ఆరేబియా, మలేషియాల నుంచి మన కొత్త నోట్లకు సంబంధించిన పేపర్ ను తెప్పించుకుని స్మగ్లర్లు ముద్రించేపనిలో వున్నారన్నది సమాచారం.
కాగా గతంలో స్మగర్లు నకిలీ నోట్ల ముద్రణకు అచ్చంగా దేశీయ కరెన్సీలో వినియోగించే కావాల్సిన కాటన్ రాగ్ సరుకుకు బదులుగా అప్ సెట్ ప్రిటింగ్ మిఫన్ల ద్వారా నోట్లను ముద్రిస్తున్నారని, దీంతో నకిలీ కరెన్పీని సులువుగా గుర్తించే అవకాశాలు వున్నాయని అంటున్నారు. ఇక కొత్త కరెన్సీని తయారు చేయటానికి కావాల్సిన యంత్రాలు అమ్మాకాలు కూడా ఆయా దేశాలకు మాత్రమే విక్రయిస్తుండగం ద్వారా నకిలీ నోట్ల స్మగ్లర్ల అటలు మునుపటిలా సాగడం లేదని నిపుణులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more