హైదరాబాద్ లోని హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో హై ఎండ్ ఫ్లాట్స్ నిర్మించిన లోధా బిల్డర్స్.. అటు అధికాదాయ వర్గాలకు, ఇటు మధ్యస్థాయి ఉన్నతాదాయ వర్గాలకు మధ్య పేచి పెట్టింది. తమకు లోధా బిల్డర్స్ అన్యాయం చేసిందని ఇటీవలే.. సినీనటుడు జగపతిబాబు సహా లోధా బెలెజ్జా ఫ్లాట్ల ఓనర్లు బిల్డర్ పై తీవ్రస్థాయిలో అగ్రహం వ్యక్తం చేసిన తరువాత.. ఇప్పడు ఆ వంతు లోధా మెరీడియన్ గృహసముదాయంలోని ఓనర్లు వచ్చింది. తమకు అగ్రిమెంట్ చేస్తున్న సమయంలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా బిల్డర్ పూర్తి చేయలేదని మండిపడుతున్నారు. దీంతో లోధా గృహసముదాల ఓనర్లు రెండుగా చీలిపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. కూకట్ పల్లిలో నిర్మించిన లోధా బిల్డర్స్ పక్కపక్కనే రెండు వెంచర్లను వేర్వేరుగా నిర్మించారు. గేటెడ్ కమ్యూనిటీ పేరుతో నిర్మించిన ఈ రెండు వేర్వేరు వెంచర్లలోని ఫ్లాట్ల ధరలు కూడా వేరు. బెలెజ్జ పేరుతో హైఎండ్ అపార్టుమెంట్లను నిర్మించిన లోధా వాటి ధరను మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు నిర్ధారించి అమ్మాకాలను కూడా చేశారు. వాటిలోనే సినీనటుడు జగపతిబాబు, నటి శ్రీయ సహా పలువురు ప్రముఖులు ఫ్లాట్లను కొన్నారు.
కాగా దీనికి పక్కనే మెరిడియన్ పేరుతో మరో అపార్టుమెంట్లను నిర్మించిన లోధా దానిని మధ్యఉన్నతవర్గదాయం గల వారిని టార్గెట్ చేసుకుని విక్రయించింది. అయితే ఈ రెండు అపార్టుమెంట్ల మధ్య అడ్డుగా వున్న ప్రహరీ గోడను తొలగించి.. తమకు అనువుగా లోనికి వచ్చేమాదిరిగా ఏర్పాటు చేయాలని మెరిడియన్ ఫ్లాట్ ఓనర్లు డిమాండ్ చేస్తుండగా, కాంపౌండ్ వాల్ తొలగిస్తే.. మాకు ప్రైవసీ ఎలా వుంటుంది.. గేటెడ్ కమ్యూనిటీ ఎలా అవుతుందని బెలెజ్జా అపార్టుమెంటు యజమానులు ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయంలో తెల్చుకునేుందుకు మెరిడియన్ వాసులు ఇవాళ కమీషనర్ కార్యాలయానికి బస్సుల్లో రాగా, వారిని పోలీసులు అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. అయితే రెండు అపార్టుమెంట్లలో ఫ్లాట్లను కోనుగోలు చేసిన యజమానులకు వేర్వేరుగా హామీలిచ్చిన బిల్డర్ పై అటు మెరిడియన్, ఇటు బెలెజ్జ వాసులు అరోపణలు గుప్పిస్తున్నా.. చర్యలకు ఉపక్రమించడంలో మాత్రం అధికారులు మీనమేషాలు లెక్కపెడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more