బాలీవుడ్ నటీనటులే కాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది నటీనటులు కేవలం మీడియా మూలంగానే వెలుగులోకి వచ్చారు. మీడియా, సోషల్ మీడియా లేకపోతే వారిని జనం కూడా మర్చిపోతారు. కేవలం మాద్యమాల బలంతోనే వారు ఉనికిని కాపాడుకుంటున్నారన్న విషయం వారికి తెలుసుకూడా. అయినా మీడియా కనబడగానే కసురుకుంటూ వెళ్లిపోతారు. మీడియా అంటే అంత చిత్కారం ఎందుకో మాత్రం అర్థంకాని ప్రశ్న.
మూడు రోజుల వ్యవధిలో ఇటు కర్ణాటకలో ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ కాల్చివేత ఘటనను మరువక ముందే అటు బిహార్ లో కూడా పంకజ్ అనే పాత్రికేయుడిపై కాల్పులు జరిపి అతని నుంచి డబ్బులను లాక్కెళ్లిన ఘటనతో దేశంలో జర్నలిస్టులకు భద్రత కరువైందన్న వార్తలు ఓ వైపు సంచలనంగా మారుతున్న క్రమంలోనే.. మహారాష్ట్రలో కూడా పాత్రికేయులను లక్ష్యంగా చేసుకుని బౌతికదాడులకు పాల్పడ్డారు ఇద్దరు హోటల్ బౌనర్లు.
దేశ అర్థిక రాజధాని ముంబై మహానగరంలో ఇద్దరు ఫోటో జర్నలిస్టులపై స్టార్ హోటల్ బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. తాము ఫోటో జర్నలిస్టులమని చెబుతున్నా వినకుండా.. వారిపై పిడిగుద్దులు గుద్దుతూ తీవ్రగాయాపాలు చేశారు. రుధిరగాయాలపాలైన జర్నలిస్టులు అస్పత్రిలో చికిత్స పోందతున్నారు. నిన్నటితరం బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఫొటోలు తీసినందుకు ఫోటో జర్నలిస్టులపై దాడిచేశారు. ముంబైలోని బాస్టియన్ రెస్టారెంట్ కు వెళ్లిన క్రమంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. స్థానికి రెస్టారెంట్ కు నాటి నటి శిల్పాశెట్టి తన భర్త రాజ్కుంద్రాతో కలిసి వెళ్లిందన్న సమాచారం అందుకున్న ఫొటో జర్నలిస్టులు రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు. శిల్పా, రాజ్లు కారులో నుంచి దిగగానే ఫొటోగ్రాఫర్లు గబగబా ఫొటోలు తీశారు. ఇందుకు రాజ్, శిల్పా కూడా సహకరించారు. కానీ రెస్టారెంట్ వద్ద ఉన్న బౌన్సర్లు మాత్రం వారి ఫొటోలు తీసినందుకు సోను, హిమాన్షు అనే ఇద్దరు ఫొటోగ్రాఫర్లపై దాడి చేశారు. దీంతో ఘటనపై పోలీసులకు పిర్యాదు చేసిన ఫోటోగ్రాఫర్లు.. అలాగే తమ మీడియా సంస్థలకు కూడా సమాచారం చేరవేసి అస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more