దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని ఎడతెరపి లేకుండా గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్థంభించింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ముంబైకర్లు అతలాకుతలం అవుతున్నారు. ఇప్పటికే ముంబైలోని అన్ని ప్రధాన ప్రాంతాలు నీటమునిగగా, సియోన్, ముంబై సెంట్రల్, అంధేరి, వార్లీ, సహా అన్ని ప్రాంతాల్లు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే ముంబైకర్ల జీవనం.. గృహనిర్భంధాన్ని తలపిస్తుండగా, ఇక ఇవాళ సాయంత్రం భారీ ఎత్తు అలలతో ముంబైని ముంచెత్తే అవకాశాలు వున్నాయని వాతావారణ కేంద్రం అధికారుల అలర్ట్ లతో ముంబైవాసుల్లో దడ మొదలైంది.
రమారామి ఇళ్లలోంచి బయటకు వచ్చే సరిస్థితి లేకపోయినా.. కార్యలయాలకు వెళ్లక తప్పకపోవడంతో ముప్పుతిప్పలు పడుతూ.. విధులకు హాజరైన ముంబైకర్లు.. సాయంత్రం తరువాత భారీ అలలు ముంచెత్తుతాయని ఇటు వాతావరణ శాఖ అటు పోలీసులు అలర్ట్ చేయడంతో.. ముంబైవాసుల్లో అందోళన రేగుతుంది. ఇప్పటికే ముంబై పోలీసులు ప్రజలకు పలు విధాలుగా అప్పీలు చేశారు. వీరితో పాటు జాతీయ విపత్తు నివారణ సంస్థ సిబ్బంది కూడా ముంబైవాసులను హెచ్చరించింది.
అవసరమైన పనులు వుంటే తప్ప.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. సాయంత్రం ఐదున్నర గంటల తరువాత సముద్రతీరంలో భారీ ఎత్తు సుమారు మూడున్నర అడుగుల ఎత్తులో అలలు ఏర్పడే అవకాశాలు వున్నాయని. దీంతో సముద్రం నీరు ముంబై నగరంలోకి వచ్చే ప్రమాదముందని కూడా చెప్పారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సాయంకాలనికన్నా ముందుగానే ఇళ్లకు చేరకునేందుకు అనుమతివ్వాలని ఆయా శాఖలకు ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది.
This is SV Road Irla right now. Avoid at all means. #mumbairains pic.twitter.com/nwo5U4StC3
— Hardik Shah (@hardik) August 29, 2017
2005 జూలై 26 నాటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు లేవని, అయితే ఏకధాటిగా వర్షం కురిసే అవకాశాలు మాత్రం కొనసాగవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు, అయితే 2005 జూలై తరువాత అంతస్థాయిలో వర్షం కురవడం.. భారీ వరదలతో భీతావాహ వాతావరణం మాత్రం ఇప్పుడు ఏర్పడిందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ముంబై నగరంలోని రోడ్లు, వీధులు, ఆస్పత్రులు, వ్యాపార సముదాయాలు, రైల్వే పట్టాలు, స్టేషన్లు నీటమునిగాయి. చాలా ప్రాంతాల్లో నడుములోతు నీళ్లు నిలువడంతో రోడ్లు, వీధులు చెరువులను తలపిస్తున్నాయి.
భారీ వర్షాలు ఇలాగే కొనసాగితే సాయంత్రం 4 గంటల తర్వాత భారీ అల ముంచెత్తే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ), విపత్తు నిర్వహణ విభాగం అప్రమత్తమయ్యాయి. స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రోడ్ల మీద నడుములోతు నీళ్లు నిలిచినట్టు, భవనాల్లోకి నీళ్లు వస్తున్నట్టు సమాచారం అందుతోంది. పలు ప్రభుత్వ ఆస్పతుల్లోనూ వరదనీరు వచ్చి చేరుతుండటంతో రోగుల పరిస్థితి దారుణంగా మారింది.
This is KEM Hospital now! Appalling status of healthcare in Mumbai @Dev_Fadnavis #MumbaiRains pic.twitter.com/0wIRkGHgxN
— Preeti Sharma Menon (@PreetiSMenon) August 29, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more