తన శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన అధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. శిక్షను ఇవాళ ఖరారు చేసేందుకు ముందు సీబిఐ న్యాయవాదితో పాటు ప్రతివాది వాదనలను కూడా విన్న న్యాయస్థానం గుర్మీత్ సింగ్ కు పదేళ్ల శిక్ష ను విధించింది. న్యాయస్థానంలో న్యాయమూర్తి శిక్షను ఖరారు చేస్తున్న క్రమంలో కన్నీళ్ల పర్యంతమైన గుర్మీత్ తనను క్షమించాలని, తన పట్ల కరుణ చూపాలని న్యాయస్థానంలోనే కన్నీళ్ల పర్యంతమైయ్యారు.
న్యాయస్థానం తీర్పును వెలువరించిన తరువాత కూడా న్యాయస్థానాన్ని వదలి వెళ్లేందుకు డేరా ఛీప్ సిద్దపడలేదు. ఆయన కోర్టులోనే చిన్నపిల్లాడిలా కుప్పకూలిపోయారు. కాగా జైలు అధికారులు గుర్మీత్ సింగ్ కు ఎలాంటి రాచమర్యాదలు చేయకుండా సర్వసాధరణ ఖైదీగానే పరిగణించాలని కూడా న్యాయమూర్తి అదేశాలు జారీ చేశారు. ఇటీవల ఆయనపై అభియోగాలు నిరూపితమై.. న్యాయస్థానం దోషిగా పరిగణించిన నేపథ్యంలో జైలుకు చేరుకున్న ఆయనకు రాచమర్యాదలు చేసినట్లు.. వార్తలు వచ్చిన క్రమంలో న్యాయమూర్తి ఈ మేరకు అదేశాలను జారీ చేశారు.
గుర్మిత్ సింగ్ శిక్షను ఖారారు చేయనున్న నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢి్ల్లీ సహా రాజస్థాన్ రాష్ట్రాలలో కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటును చేశాయి. మరీముఖ్యంగా పంచకులలో 144 సెక్షన్ విధించారు. దీనికి తోడు రోహ్ తక్ జైలు పరిసర ప్రాంతాల్లో కనిపిస్తే కాల్చివేత అదేశాలు అమలువున్నాయి. కాగా, అయన దోషిగా తేల్చిన క్రమంలో హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో రేగిన హింసాత్మక ఘటనలు ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమేనని కూడా నిరూపితమయ్యాయి. దీంతో రోహ్ తక్ జైలులోనే ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయగా, న్యాయమూర్తి జైలు నుంచే తీర్పును వెలువరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more