దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. పౌరల వ్యక్తిగత గోప్యత వారి ప్రాథమిక హక్కు అంటూ తీర్పును వెలువరించిన నేపథ్యంలో అంత్యంత సంచలన విషయాలు వెలుగు చూశాయి. భారతీయులకు సంబంధించిన వ్యక్తిగత వివరాల గోప్యత అత్యంత సురక్షితంగా వుందని చెప్పుకోచ్చిన ప్రభుత్వం వ్యాఖ్యలన్ని తప్పేనన్న కథనాలు జాతీయ మీడియాలో సంచలనంగా మారాయి. కేంద్రం చెప్పిన్న మాటలన్నీ మాటల్లోనే గాంబీర్యం తప్ప.. వాస్తవానికి అనేక డిల్లతనం వుందన్న విషయాన్ని ప్రముఖ సంస్థ వికీలీక్స్ ప్రకటించడంతో భారత్ వ్యాప్తంగా అందోళన రేకెత్తుతుంది. భారతీయులకు సంబంధించిన ఆధార్ డేటాబేస్ ను అమెరికా నిఘా సంస్థ తెలుసుకునే ప్రమాదముందని వికీలీక్స్ సంచలన ప్రకటన చేసింది.
అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీఐఏ) ఓ ప్రత్యేక టూల్ సాయంతో ఆధార్ డేటాను రహస్యంగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోందని వికీలీక్స్ ఓ డాక్యుమెంట్ ను ప్రచురించింది. ఈ మేరకు ట్విటర్ ద్వారా డాక్యుమెంట్ లింక్ ను షేర్ చేసింది. ‘ఎక్స్ప్రెస్ లేన్ అనే టూల్ ను సీఐఏ ఉపయోగిస్తోంది. ఈ టూల్ ను అమెరికాకు చెందిన క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ తయారు చేసింది. దీని సాయంతో క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ కు అనుసంధానంగా ఉన్న సర్వీసుల నుంచి డేటాను రహస్యంగా తెలుసుకోవచ్చు’ అని వికీలీక్స్ డాక్యుమెంట్స్ లో పేర్కొంది.
భారత పౌరుల వివరాలను సేకరించేందుకు వినియోగించిన బయోమెట్రిక్ పరికరాలలో కొన్నింటిని క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ తయారు చేసింది. ఈ పరికరాలను ఆధార్ నమోదు కోసం ఉపయోగించినట్లు ఉడాయ్ కూడా ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో వికీలీక్స్ డాక్యుమెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అంతేగాక.. క్రాస్ మ్యాచ్ లాంటి కంపెనీల బ్యాగ్రౌండ్ ను చూసుకోకుండానే ఉడాయ్ వీటిని ధ్రువీకరించి ఉంటుంది అని వికీలీక్స్ డాక్యుమెంట్లలో పేర్కొంది. అంతేగాక రియల్ టైమ్ లో ఆధార్ డేటాబేస్ ను సీఏఐ తెలుసుకోవచ్చు అని సందేహం వ్యక్తం చేసింది
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more