ధరణి అంబే భూమి.. అలాంటి భూమికి నిజంగా కష్టమెచ్చినా పాలకులకు పట్టదా..? అంటే పట్టదన్నట్లే వుంది. ఒకటి రెండు కాదు గత కొన్నేళ్లుగా ఇలాంటి సమస్య ఉత్పన్నం అవుతున్నా పాలకులు తాత్కాలికమైన చర్యలే తీసుకున్నారు తప్ప.. దానికి శాశ్వత పరిష్కారం చూపలేదు. దీంతో ఎప్పుడు వనోచ్చినా.. ఎప్పుడు వరదలోచ్చినా.. అదను చూసుకుని కాలుష్యకార కంపెనీల తమ విషవాయువలను వదిలేయడంతో.. విషనురగలు ఏకంగా ధరణి నగర్ ముంచెత్తాయి. ఏకంగా మంచుకొండలను తలపిస్తున్న ఈ నురగలతో తాము సావాసం చేయలేమని స్థానికులు అవదేన వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. నగరంలో క్రితం రోజున కురిసిన భారీ వర్షానికి నగరవాసుల జీవనం అతలాకుతలమైంది. కూకట్పల్లి అల్విన్ కాలనీ, ధరణి నగర్ ను కాలుష్యపు నురగ ముంచెత్తింది. ధరణి నగర్ లోని పరికి చెరువులో స్థానికంగా వుండే రసాయన పరిశ్రమలు వదిలిన కాలుష్య నిటీతో నిండిపోయింది. భారీ వర్షానికి ఈ నీళ్ల నుంచి రసాయన నురుగు వచ్చి ఇళ్లోలోకి చేరింది. ఈ నురగతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో స్థానికులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. తెల్లగా, మంచు గుట్టలా పేరుకుపోయిన నురుగును తొలగించుకోవడానికి స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. మంచు కొండలను తలపిస్తున్న నురగను చూసి స్థానికులు భయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితి ఉత్పన్నమైందని చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగం చుట్టు ప్రదిక్షిణలు చేసినా ఫలితం లేకపోయిందని స్థానికులు అరోపిస్తున్నారు. కేవలం తాత్కలిక పరిస్కారాన్ని మాత్రమే చూపించిన అధికారులు ఎప్పటికప్పుడు తాము వెళ్లినా అదే పరిష్కారం చూపి జారుకుంన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more