భర్తలకు చాలీచాలని జీతాబెత్యాలు రావడంతో.. ఇంటి అద్దెలు, పిల్లల చదువులకే ఆ మొత్తం సరిపోతున్న తరుణంలో అనేక మంది సతులు.. వారి పతులకు చేదోడు వాదోడుగా నిలిచేందుకు వారు చదువుకున్న చదువులను పరిగణలోకి తీసుకుని ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లుగా చేరిపోతున్నారు. ఈ మాదిరిగా రమారమి మధ్య తరగతి వర్గాల్లోని మహిళలందరూ కష్టపడుతుంటారు. అయితే ఇక ఇలాంటి టీచర్లను కూడా కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఇకపై ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పాలంటే వారు కూడా తప్పనిసరిగా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) రాయాల్సిందేనన్న నిబంధనను కొత్తగా అమల్లోకి తీసుకువచ్చింది.
ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ పరీక్షలో అర్హత సాధించి ఉండాల్సిందేనని కేంద్రం తాజాగా అదేశాలను జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ అధేశాలను పంపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు, పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే బీఎడ్, డీఎడ్ పూర్తిచేసిన ప్రైవేటు టీచర్లలో చాలామంది టెట్ లో అర్హత సాధించారు. అయితే వారు ప్రభుత్వ ఉపాధ్యాయ టీచర్ల పోస్టుల కోసం చేపట్టే డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు.
కాగా, బీఎడ్, డీఎడ్ అర్హతలు లేకుండానే టీచర్లుగా విధులు నిర్వహిస్తున్నవారు వెంటనే టీచర్ ట్రెయినింగ్ కోర్సులైన బీఎడ్, డీఎడ్ లను పూర్తిచేసేలా పాఠశాల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులలో పొందుపర్చారు. 2019 నాటికి ప్రైవేటు పాఠశాలలో బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తిచేసిన వారే ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించాలని.. ప్రస్తుతం అర్హతలు లేని వారు నిర్ణీత సమయంలో వాటిని పూర్తి చేయాలని కేంద్రం అదేశాలలో తెలిపింది.
అయితే ఇలా బీఎడ్, డీఎడ్ కోర్సులను కూడా పూర్తి చేసిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ పరీక్షలలో కూడా ఉత్తీర్ణులు కావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న శిక్షణ లేని టీచర్లకు తక్షణమే శిక్షణ ఇవ్వాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. శిక్షణ లేని టీచర్లకు వచ్చేనెలలో శిక్షణ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నది. ఇంతవరకు బాగానే వున్నా కేంద్రం తాజా నిబంధనలపై ప్రైవేటు పాఠశాలల ఉపాద్యాయ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులకు వచ్చే వేతనాలకు ధీటుగా తమకు కూడా వేతనాలు కల్పించాలని ఆ తరువాత కొత్తగా నిబంధనలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more