అతివేగం 36 మంది ప్రాణాలను బలితీసుకుంది. చైనాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిక్కిరిసిన ప్యాసింజర్లతో కూడిన ఓ బస్సు టన్నెల్ గోడను ఢీకొట్టింది.
ఘటనలో 36 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా, 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లువోయాంగ్ నుంచి చెంగ్దూ కు వెళ్తున్న బస్సు శాంక్సీ ప్రోవిన్స్ వద్ద యాక్సిడెంట్ కు గురైంది. డ్రైవర్ అతివేగంతో నడపటం మూలంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
ఘటనపై పౌర భద్రత శాఖ మంత్రి జియో షెంగ్కూన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అతివేగం, నిర్లక్ష్యం మరియు వాహనాల మధ్య దూరం మెయింటెన్ చేయకపోవటం లాంటి కారణాలతో ఈ మధ్య హైవేలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. మరోవైపు చైనాలో ఏడాదికి రోడ్డు ప్రమాదాల్లో సుమారు 2,60,000 మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఓ నివేదికలో తెలిపింది. అది చైనా జనాభాకు ప్రతీ లక్షలో 18.8 శాతంగా ఉందని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more