మన జేబులోని రూ.500 నోటు రెండు రకాలుగా ఉందా.. మనమే గుర్తించలేని విధంగా మార్పులు ఉన్నాయా.. ? అంటే అవునంటూ అరోపణలు గుప్పించింది కాంగ్రెస్. సాక్ష్యాత్తు పార్లమెంటులోని పెద్దల సభ (రాజ్యసభ)లో కాంగ్రెస్ ఎంపీలు ఇదే విషయమై ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాజ్యసభ కాంగ్రెస్ పక్ష నేత గులాం నబి అజాద్ మరో అడుగు ముందుకేసి దీనిని శతాబ్ధంలోనే అతిపెద్ద కుంభకోణమని కూడా వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు దేశ చరిత్రలోనే ఇదే ప్రప్రధమని నోక్కి మరీ చెప్పారు. నోట్ల రద్దు తరువాత ఆర్బీఐ కొత్తగా ముద్రించి మార్కెట్ లోకి విడుదల చేసిన రూ.500, రూ.2000 నోట్లు డిజైన్లు, సైజుల్లోనూ తేడా ఉందని కాంగ్రెస్ నేతలు అరోపణలు గుప్పించారు.
రెండు వేర్వేరు సైజులు, డిజైన్లకు సంబంధించిన నోట్లను కూడా చూపించిన మాజీ కేంద్రమంత్రి కపిల్ సిబాల్.. రాజ్యసభలో ఈ అంశమై ప్రస్తావిస్తూ.. కేంద్రం తీసుకువచ్చిన కొత్త నోట్ల రెండు వేర్వేరు విధాలుగా ఎందుకు వుందని ప్రశ్నించారు. ఇలా చలామణిలో వున్న రెండు వేర్వేరు నోట్ల విషయాన్ని ఇటు కేంద్రం కానీ, అటు అర్బీఐ కానీ ఎందుకు ప్రజలకు తెలియజెప్పలేదని నిలదీశారు. ఈ విధంగా రెండు నోట్లు వుంటే.. దానిని అర్బీఐ ఎందుకని తమ వెబ్ సైట్ లో ప్రస్తావించలేదని కూడా కపిల్ సిబాల్ ప్రశ్నించారు. అసలు రెండు రకాలుగా 500 నోట్లను ముద్రించటం ఏందుకని ప్రభుత్వాన్ని నిలదీశారు.
తాము కూడా దేశాన్ని పరిపాలించామని, అయితే ఇలా ప్రభుత్వం కోసం ఒక నోటును, కేవలం పార్టీ నేతల కోసం మరో నోటును ఎన్నడూ ముద్రించలేదని అన్నారు. ప్రస్తుతం చలామణిలో వున్న రెండు పెద్ద నోట్లు రూ.500, రూ.2000 ఇలా వేర్వేరు సైజులు, డిజైన్లతో వున్నాయని, దేశం కోసం ముద్రించే నోట్లలో కూడా ఇంత తేడా ఎందుకని జరిగింది. ఎలా జరిగిందో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశాన్ని పాలిస్తున్న పార్టీలు ఇలా బాధ్యతారాహిత్యంగా ఎలా వ్యవహరిస్తున్నాయని కపిల్ సిబాల్ ప్రశ్నించారు. కాగా, ఇది దేశంలోనే అతి పెద్ద స్కాం అంటూ మరో కాంగ్రెస్ నేత గులాంనబీ అజాద్ సభలో నినాదాలు చేశారు. ఆయనకు మద్దతుగా విపక్షాలకు చెందిన పార్టీలన్నీ స్వరం కలిపాయి.
జీరో హవర్లో ఎన్నో ముఖ్యమైన అంశాలపై చర్చించాల్సి ఉన్నా.. కాంగ్రెస్ మాత్రం కరెన్సీ నోట్లపై బాధ్యతారాహిత్య ప్రకటన చేస్తున్నదని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ విమర్శించారే తప్ప.. కాంగ్రెస్ నేతల ప్రశ్నలపై సమాధానాన్ని ఇవ్వలేక పోయారు. దీంతో కాంగ్రెస్ నేతలంతా సభలో ఆందోళన చేశారు. తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రైన్ కూడా కాంగ్రెస్ లేవనెత్తిన అంశాన్ని సమర్థించారు. ఇది చాలా సీరియస్ అంశమని ఓబ్రైన్ అన్నారు. జేడీయుకి చెందిన ఎంపీలతో పాటు విపక్ష సభ్యులందరూ ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీశారు. దీంతో సభలో గంధరగోళం ఏర్పడింది. పది నిమిషాల వాయిదా అనంతరం సభ మళ్లీ ప్రారంభమైన ఏ మాత్రం మార్పు కనిపించకపోవడంతో.. సభను డిఫ్యూటీ చైర్మన్ కురియన్ బుధవారానికి వాయిదా వేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more