సామాన్యుల అపిల్ పండుగా పిలిచే టామాటాల ధరలు అందకుండా పైపైకి ఎగబాకుతున్నాయి. నిత్యవాసర సరుకుల ధరలను సామాన్యులకు అందుబాటులో వుంచే విధంగా చేస్తామని, వాటి ధరలపై ఎప్పటికప్పుడు పరిశీలించి..చెక్ పెడతామని ఎన్నికలకు ముందు చెప్పిన మాటలను కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయినట్లుంది. కేజీ టామాటా ధర ఏకంగా రూ.120 వరకు వెళ్లగా.. వాటిని అందుకునేందుకు సామాన్యులు మాత్రం పడరాని పాట్లు పడుతున్నారు. పెరట్లో పెంచుకోదగిన ఈ టామాటాలకు ఇప్పడు వచ్చిన గిరాకీ వింటే.. నిర్థాంతపోకతప్పదు.
కొందరు పనిగట్టుకుని మార్కెట్లకు వెళ్లి టామాలోలను చౌర్యం చేస్తున్నారుని చెప్పినా అతిశయోక్తి కాదు. ఓ వైపు రైతులకు మాత్రం వారి సరుకుకు ధర రాక లబోదిబో మంటుంటే.. వినియోగదారులు మాత్రం ధరాఘాతంలో బెంబేలెత్తిపోతున్నారు. అయితే మధ్యనున్న దళారీలు మాత్రం లాభాలను అప్పన్నంగా మేసేస్తున్నారు. అయినా కేంద్రం మాత్రం ధరలను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పట్టనట్టు వ్యవహరిస్తుందన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి.
దాంతో మండుతున్న టొమాటో ధరలకు నిరసనగా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్తర్ప్రదేశ్ రాజధాని లఖ్ నవూలో ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ టొమాటో’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసి నిరసనను వ్యక్తం చేశారు. సాధారణ బ్యాంకుల్లో లోనుగా నగదు ఇస్తే ఈ బ్యాంక్లో టొమాటోలను రుణాలుగా ఇస్తున్నారు. విషయం తెలిసి కస్టమర్లు బ్యాంకుకు బారులుతీరారు. ఇందులో తమ వద్ద ఉన్న టొమాటోలు డిపాజిట్ చేస్తే ఆరు నెలల తర్వాత రెట్టింపు మొత్తంలో టొమాటోలు వస్తాయని ఈ సందర్భంగా కస్టమర్లు మీడియా ద్వారా వెల్లడించడం విశేషం. ‘నేను ప్రస్తుతం అర కేజీ టొమాటోలు డిపాజిట్ చేశారు. ఆరు నెలల తర్వాత కేజీ టొమాటోలు పొందుతాను’ అని 103 ఏళ్ల ఓ వృద్ధుడు చెప్పాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more