ఆంద్రప్రదదేశ్ రాష్ట్రంలోని అధికార పక్ష తెలుగుదేశం పార్టీతో పాటుగా పలు పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. నంద్యాల ఉప ఎన్నికలో భాగంగా ఫోటీ బరిలో నిలవనున్న అభ్యర్థులందరికీ ఈ షాక్ తగలనుంది. అయితే నంద్యాల ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పార్టీలకు జలక్ తగిలింది. మరీ ముఖ్యంగా ఈ ఎన్నికలలో ఎలాగైన గెలిచి తమ సత్తాను చాటాలని భావిస్తున్న అధికార పార్టీకి, ప్రజల్లో తమ ప్రభుత్వ పథకాలపై ఎక్కడా వ్యతిరేకత లేదని చాటుకునేకు ప్రయత్నంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం.
జనవరి 1, 2017 వరకూ ఓటర్ల జాబితాలో ఉన్నవారికే ఓటు హక్కు కల్పిస్తూ ఈసీ తాజా నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో అంటే జనవరి తరువాత నమోదైన ఓటర్లను ఎన్నికలలో పాల్గోననీయకుండా చర్యలను తీసుకుంది. వీరిని పరిగణలోకి తీసుకోబోమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఇటీవేల దాదాపు 15వేల మందిని కొత్తగా ఓటర్లగా పార్టీలు నమోదు చేయించాయి. దీంతో పార్టీల కుట్రలను ముందగానే పసిగట్టిన కేంద్ర ఎన్నికల సంఘం వారి వ్యూహాలకు తమ నిర్ణయంతో చెక్ పెట్టింది.
నంద్యాలలో ఈ ఏడాది జనవరి 1 వరకూ సుమారు 2లక్షల 9వేలమంది ఓటర్లు ఉన్నారు. ఆ తరువాత చేరిన వారి సంఖ్య ఎన్నికల సంఘాన్ని కొంత విస్మయానికి గురిచేసిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. అయితే నకిలీ ఓటర్లను జాబితాలో చేర్చి ఉపఎన్నికలలో లబ్ధిపొందాలని చూసిన వారికి చెక్ పడినట్లు అయ్యింది. దీంతో వచ్చే నెల 23న నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో మరో వ్యూహాన్ని అమలు చేయాలని పార్టీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉపఎన్నిక బరిలో అనేక మంది బరిలో నిలుస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more