గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. అదిలోనే రెండు వికెట్లను కోల్పోయింది. చత్తీశ్వర్ పూజారా ఔట్ అయిన వెంటనే వర్షం కురవడంతో మ్యాచు నిలిచిపోయింది. అయితే ధాటిగా అడి భారత్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాలన్న తొందరలో తొలి ఇన్నింగ్స్ లో 190 పరుగులు చేసిన శిఖర్ ధావన్ 12 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ధీరువన్ పెరీరా విసిరన బంతిని ఫాట్ కోట్టబోయి డిసిల్వాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అప్పటి నుంచి అచితూచి అడుతున్న ఓపెనర్ అభినవ్ ముకుంద్, ఛత్తీశ్వర్ పూజారాలు.. నిలకడగా అడుతూ స్కోరుబోర్డును నెమ్మెదిగానే కదిలించారు. కాగా లహిరు కుమార విసిరన బంతిని ప్లిక్ చేసే క్రమంలో అది కాస్తా కుసల్ మెండిస్ క్యాచ్ పట్టడంతో 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవీలియన్ కు చేరకున్నాడు. అ తరువాత విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోకి వెళ్తున్న క్రమంలో వరుణుడు మ్యాచ్ ను అడ్డుకున్నాడు. అయితే తొలిఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు కూడా విజృంభించారు.
తమదైన పదునైన బంతులను విసురుతూ.. అతిథ్యజట్టుకు కట్టడి చేశారు. ఫలితంగా లంకేయులను 291 స్కోరుకు అటౌట్ చేశారు. అనుకున్నట్లే టీమిండియా శ్రీలంకను ఫాలో ఆన్ అడించే అవకాశమున్నప్పటికీ.. బౌలర్లకు విశ్రాంతిని కల్పించాలన్న ఉద్దేశ్యంతో పాటు మ్యాచ్ పై పట్టుబిగించేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ టీమిండియా రెండో ఇన్నింగ్స్ ను అడేందుకు నిర్ణయం తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో లంకపై సాధించిన 309 పరుగుల అదిపత్యానికి మరికొన్ని పరుగులు జోడించిన తరువాత టీమిండియా డిక్లేర్ చేసే అవకాశాలు వున్నాయి.
మరో రెండు వందల పరుగులు చేసిన తరువాత కెప్టెన్ విరాట్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తుంది. కాగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో పెరీరా ఒంటరిపోరు చేశాడు. అయితే ఆయనకు మద్దతుగా ఒక్కరిద్దరు దాటిగా బ్యాటింగ్ చేసినా ఎక్కవ సేపు క్రీజులో నిలవలేకపోయారు. పెరీరా మాత్రం 10 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 92 పరుగులు చేసిన నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో జడేజాకు 3, షమీకి 2, యాదవ్, అశ్విన్, పాండ్యాలకు తలో వికెట్ లభించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more