బీహార్ లో రాజకీయ సంక్షోభం ముదిరింది. తన కొడుకు లాంటి మహాకూటమిని తానే ఎందుకు చంపుకుంటానని వారం రోజుల క్రితం వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎట్టకేలకు అంతపనీ చేశారు. మహాకూటమిని నట్టేట ముంచేసి.. తన దారి తాను చూసుకున్నారు. ఇవాళ రాత్రి బీహర్ గవర్నర్ ను కలసిన ఆయన తన రాజీనామాను సమర్పించారు. అధికార పార్టీ జేడీయూ, ఆర్జేడీ మధ్య వివాదం కారణంగానే నితీశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ పై సీబిఐ దాడుల నేపథ్యంలో ఆయనను రాజీనామా చేయాలని అదేశించినా.. అందుకు తేజస్వి యాదవ్ నిరాకరించడంతో కనీసం వివరణనైనా ఇవ్వాలని చెప్పారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలకు తాము వివరణ ఇస్తాము కానీ, ప్రభుత్వ పరంగా ఎందుకు వివరణ కోరుతున్నారని తేజస్వీ యాదవ్ మెలిక పెట్టారు. దీంతో నితీశ్, లాలూ మధ్య విభేదాలు పొడచూపాయి. దీంతో నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్ ను కలిసి తన పదవికి రాజీనామా పత్రాన్ని సమర్పించానని చెప్పారు. సంకీర్ణ ధర్మాన్ని పాటించేందుకు చివరి క్షణం వరకు ప్రయత్నాలు చేశానని, సంకీర్ణ భాగస్వామ్యంలోని కాంగ్రెస్ తో కూడా చర్చలు జరిపామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో స్వయంగా మాట్లాడానని, ఎన్ని ప్రయత్నాలు చేసినా, సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. దీంతో ఇక చేసేది లేక తన పదవికి రాజీనామా చేశానని చెప్పారు.
ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావాలని భావించానని, అయితే కొన్ని సంఘటనల కారణంగా తాను పని చేసే వాతావరణం సరిగా లేకపోవడంతో తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం నడపడం కష్టంగా ఉందని అన్నారు. ప్రభుత్వాన్ని నడపగలిగినంత కాలం నడిపానని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడిపించేందుకు తన అంతరాత్మ అంగీకరించలేదని, అందుకే, తన పదవికి రాజీనామా చేశానని చెప్పారు.
బీహార్ ప్రజల అభివృద్ధి కోసం, వారి ప్రయోజనాల కోసమే తన పదవికి రాజీనామా చేశానని చెప్పారు. బీహార్ అభివృద్ధే తన జీవితాశయమని, ఆ పని చేయలేనప్పుడు ఆ పదవి తనకు అనవసరమని, ఇప్పటివరకు తనకు సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. నీతి, నిజాయతీతో కూడిన రాజకీయాలను నమ్మినవాడినని, చివరి క్షణం వరకూ దానికే కట్టుబడి ఉంటానని నితీశ్ కుమార్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more