ఆయన మాజీ ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్నారు. అయితే అయన వెనుకు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించేంత శాసనసభ్యుల బలం వుంది. దీంతో ఆ మాజీ సీఎంనే ఆ రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసి ఇవాళ సాయంత్రమే ఆయనను ప్రమాణ స్వీకారానికి అహ్వానిస్తూ లేఖను పంపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని స్వాగతించారు. అంతేకాదు ఈ నెల 22లోగా తన బలాన్ని శాసనసభలో నిరూపించుకోవాలని కూడా సూచించారు. ఏంటీ ముఖ్యమంత్రిని గవర్నర్ ఎంపిక చేయడమేంటి.. అందూలోనూ మాజీ సీఎంకు పిలిచి మరీ అధికారం ఇవ్వడమేంటని అనుకుంటున్నారా..?
నాగాలాండ్ తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా వున్న లీజిత్పు తన పదవిని కోల్పోయారు. ఆయనకు ఆ రాష్ట్ర గవర్నర్ పీబీ అచార్య ఇచ్చిన గడువులోపు తన బలాన్ని నిరూపించుకోవాల్సి వుండగా, తనకు బలం లేదని పరోక్షంగా అంగీకరిస్తూ.. ఆయన సభకు కూడా హాజరుకాలేదు. దీంతో ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రిగా జెలియాంగ్ సీఎంగా గవర్నర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగాఈ నెల 22లోగా శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాలని జెలియాంగ్ కు గవర్నర్ అచార్య స్పష్టం చేశారు.
నాగాలాండ్ లో సంక్షోభం ఎలా తలెత్తిందంటే.. మాజీ సీఎం టీఆర్ జెలియాంగ్ లీజిత్పు ప్రభుత్వానికి ఎదురు తిరగారు. అంతేకాదు అసెంబ్లీలో తనకే అధిక శాసనసభ్యుల మద్దతు వుందని తనను ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించాలని గవర్నర్ ఆచార్యకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లలో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ సీఎం లీజిత్పు ప్రభుత్వాన్ని అదేశించారు. అయితే గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన లీజిత్సు ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన గువాహటిలోని కోహిమా బెంచ్ న్యాయస్థానం గవర్నర్ ఆదేశాలపై జులై 17 వరకు స్టే విధిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
జులై 18న మంగళవారం మరోసారి విచారణ చేపట్టిన కోర్టు గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో బలపరీక్షకు సిద్ధమవ్వాలని గవర్నర్ సీఎం లీజిత్సును సూచించారు. ఇందుకోసం ఇవాళ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి లీజిత్సు గానీ.. ఆయన మద్దతుదారులు గానీ హాజరుకాలేదు. వారితో ఫోన్లో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయని స్పీకర్ ఇమ్తివపాంగ్ గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో శాసనసభను నిరవధిక వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో కొత్త సీఎంగా జెలియాంగ్ ను ప్రకటిస్తూ.. గవర్నర్ నిర్ణయం తీసుకుని 22లోగా బలాన్ని నిరూపించుకోవాలని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more