టాలీవుడ్ లో అలజడి రేపుతున్న డ్రగ్స్ కేసును తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు మరింత వేగం పెంచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఎక్సైజ్ అధికారి అకున్ సబర్వాల్ కు ఫోన్ చేసి ఈ కేసులో విషయానలు దాయడం సబబు కాదని, ఎంతటి ప్రముఖులు వున్నా.. నిర్థారణ చేసుకున్న వెంటనే వాటిని మీడియాలో తెలియజేయాలని అదేశించిన నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును పోలీసులు వేగిరం చేశారు. ముందుగా సెలవు పై వెళ్లాలని అనుకున్న అధికారి సబర్వాల్.. తన లీవ్ ను రద్దు చేసుకుని మరీ దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే డ్రగ్స్ సేవిస్తున్నారని నిర్థారణ అయిన తరువాత కొందరు సినీ ప్రముఖులకు నోటీసులు పంపిన ఎక్సైజ్ శాఖ.. ఈ కేసులో వున్న మరికొందరికి కూడా తాజాగా నోటీసులను అందించింది. తమ నోటీసులు అందుకున్న ప్రముఖులందరూ ఈ నెల 19 నుంచి అగస్టు 3 వరకు తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని అదేశాలను జారీ చేసింది. ఈ కేసుతో సంబంధమున్న ఒక్కోక్క సెలబ్రిటి ఒక్కో రోజున ఉదయం ఎక్సైజ్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు వారికి జారీ చేసిన నోటీసులలో పేర్కోన్నారు.
ఈ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్ కి కూడా ఈ రోజు ఎక్సైజ్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేసి.. ఈ నెల 19న విచారణకు హాజరు కావాల్సిందేనని అందులో పేర్కొన్నారు. తొలి రోజునే పూరీ జగన్నాథ్ను విచారిస్తున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. కాగా 20వ తేదీన హీరోయిన్ ఛార్మీ, 21న నటి మొమైత్ ఖాన్, 22న నటుడు సుబ్బరాజు, 23న ప్రముఖ కెమెరా మ్యాన్ శ్యాం కే నాయుడు సిట్ ఎదుట హాజరై తమకు డ్రగ్స్ తో వున్న సంబంధాలపై వివరణను ఇవ్వనున్నారు.
మాస్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్న ప్రముఖ హీరో రవితేజ ఈ నెల 24న సిట్ ఎదుట హాజరకానున్నారు. ఆయన తల్లి, స్నేహితుడు రవితేజకు డ్రగ్స్ తో సంబంధం లేదని, అతనితో భరత్ ను పోల్చవద్దని వాఖ్యలు చేసినా.. ఎక్సైజ్ శాఖ మాత్రం ఆయనకు కూడా నోటీసులు జారీ చేసి 24న తమ ఎదుట హాజరుకావాలని అదేశించింది. ఈ నెల 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను, 26న హీరో నవదీప్, 27న హీరో తరుణ్, 28న యువ హీరోలు తనీష్, నందులను సిట్ విచారించనుంది. పేరు మోసిన డ్రగ్స్ సరఫరాదారుడు కెల్విన్ కాల్ లిస్ట్ ఆధారంగా వీరికి తెలంగాణ ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీచేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more