రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటమే తమ ప్రధాన విధి అని పేర్కోంటూ ఎన్నికల హామీలను గుప్పించి.. అధికారంలోకి వచ్చిన బీజేపి నేతృత్వంలోని యోగీ అధిత్యనాథ్ ప్రభుత్వంలో.. మైనారిటీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. స్వేచ్ఛా, స్వతంత్ర్యాల మద్య వారు మునుపటిలా వ్యవహారాలను చేపట్టలేకపోతున్నారు. ఉత్తర్ ప్రధేశ్ లో అధికార మార్పిడి సమాజ్ వాదీ నుంచి బీజేపి కి బదిలీకావడంతో ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో ముస్లింలపై దాడులు పెరిగాయన్న అరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇందుకు సంబంధించిన ఓ ఘటన వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేగుతోంది. తనను కూడా ఎవరైనా చంపుతారన్న భయాందోళనకు గురైన ఓ ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగ విధులను నిర్వహించేందుకు నిత్యమూ బురఖా వేసుకుని ప్రయాణాలు చేస్తూ, రైల్వే పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్ కు చెందిన నజ్ముల్ అనే వ్యక్తి, అలీగఢ్ సమీపంలోని కసింపూర్ పవర్ స్టేషన్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో ప్రతి రోజూ అతను రైలులో ప్రయాణించి విధులకు హాజరవుతున్నాయడు. కాగా ఇటీవల రైలులోని సీటు విషయంలో ఆయనకు స్థానికుడైన మరో వ్యక్తితో రైల్వే స్టేషన్ లో గొడవ పడ్డాడు.
తన ఘటన జరిగిన తరువాత.. ఇలాంటి ఘటనలోనే రైల్లో జునైద్ అనే బాలుడిని కొందరు కొట్టి చంపిన ఘటన గురించి తెలుసుకుని భయాందోళనకు గురయ్యాడు. తాను కూడా ముస్లింను కాబట్టి, తనపైన కూడా దాడి చేస్తారేమోనని భయపడి, బురఖా వేసుకుని ప్రయాణాలు చేస్తున్నాడు. అయితే నిన్న మాత్రం అతడి నడకతీరుపై అనుమానాం కలిగిన రైల్వే పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. తన మనసులోని భయాన్ని నజ్ముల్ పోలీసులకు వెల్లడించాడు. అనుమానాస్పద వస్తువులేమీ లభ్యం కాకపోవడంతో, అతడికి పోలీసులు ధైర్యం చెప్పి పంపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more