దివంగత భూమానాగిరెడ్డి వారసురాలు, ఏపీ మంత్రి అఖిలప్రియ వ్యవహార శైలిపై టీడీపీ సీనియర్లలో కాస్త అసంతృప్తి నెలకొన్నప్పటికీ, నంద్యాల ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న ఆమె ప్రయత్నంకు మాత్రం మంచి సహకారం అందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థి వైసీపీపై ఆమె ఛాన్స్ దొరికినప్పుడల్లా విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తమ కుటుంబంలో చిచ్చుపెట్టాలన్న ప్రత్యర్థుల కుట్రను బయటపెట్టింది.
ఒకానోక దశలో తమ కుటుంబంలో కూడా విభేదాలు తెచ్చే ప్రయత్నం చేశారని, అయితే వాటన్నింటిని దాటుకుని తాము బరిలో నిలిచామని ఆమె చెప్పింది. ముందుగా నంద్యాల బైపోల్ బరిలో తాను దిగుతానని తన చెల్లెలు మౌనిక తనతో చెప్పినట్లు అఖిల వెల్లడించింది. అయితే తన చెల్లెలుకి తానే సర్ది చెప్పి సోదరుడు బ్రహ్మానందరెడ్డిని ఎన్నికల బరిలో నిలిపానని ఆమె అంటోంది. ఈవిషయంలో అధినేత చంద్రబాబు కూడా తనపై నమ్మకంతో నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని, అందుకు ప్రత్యేకంగా కృతజ్నతలు తెలుపుతున్నానని ఆమె అంది. సీనియర్లు తనపై గుర్రుగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. తాను పార్టీలో అందరితోపాటే ముందుకు సాగుతానని, అలాంటిదేమైనా ఉంటే తనకిప్పుడు ఇంత మద్ధతు లభించేందే కాదు కదా అని చెబుతోంది.
ఉప ఎన్నిక తన తండ్రి నియోజకవర్గంలో జరుగుతున్నదని, తన తండ్రి చేయాల్సిన పనులను పూర్తి చేయాల్సిన బాధ్యతతో ఆడబిడ్డగా తాను మాట్లాడుతున్నానన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో గెలుపు ముమ్మాటికీ టీడీపీదేనని, తన తండ్రి ఈ లోకంలో లేకపోయినా సీఎం తోడ్పాటుతో అభివృద్ది చేస్తున్నామన్నారు. కేవలం ఎమ్మెల్యే పదవి కోసం శిల్పా మోహన్రెడ్డి పార్టీ వీడాడని, చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు పోటీలో ఉంటే పోటీ చెయొద్దన్న ప్రాథమిక సూత్రాన్ని వైసీపీ మరిచిందిన మండిపడింది. ఓడితే దానికి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేస్తానని గతంలో చేసిన సవాల్ ను మరోసారి గుర్తు చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more