దేశ అర్థిక రాజధాని ముంబైలోని బైకుల్లా జైలులో గత రెండు రోజులుగా మహిళా ఖైదీలు అందోళన బాట పట్టారు. తమ జైలులో అన్యాయంగా ఓ ఖైదిని అధికారులు హత్య చేశారని అరోపిస్తూ సుమారు 200 మంది ఖైదీలు నిరసన వ్యక్తం చేశారు. అందోళన చేస్తున్న వారిలో ప్రముఖ మహిళా పారిశ్రామిక వేత్త ఇంద్రాణి ముఖర్జియా కూడా వున్నారు. అందోళనకారులందిరితో పాటు అమెపై కూడా పోలీసులు మరో కేసును నమోదు చేశారు. ఇక మరోవైపు ఈ జైలులో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు మహిళా కానిస్టేబుళ్లు.. జైలర్ మనిషా పోకార్కర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అసలేం జరిగింది..?
1996 జనవరి 4న తన సోదరుడి భార్య విద్యా షిత్యే పై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవదహం చేసిన కేసులో గోదావరి షిత్యే సహా మంజుల షిత్యే ఇద్దరూ దోషులగా నిర్ధారించి న్యాయస్థానం వారికి జీవిత ఖైదు శిక్షను విధించింది. దీనిని సవాల్ చేస్తూ వారు బొంబే హైకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా వారికి చుక్కెదైంది. ఈ క్రమంలో శిక్షను అనుభవిస్తూ మంజుల తల్లి గోదావరి అనారోగ్యం మరణించింది. కాగా మంజుల షిత్యే మాత్రం ఎర్రవాడ జైలులో శిక్షను అనుభవిస్తుంది. అయితే ఇటీవల అమెను ఎర్రవాడ నుంచి బైకుల్లా జైలుకు బదిలీ చేశారు.
మూడు నెలల క్రితం బైకుల్లా జైలు వచ్చిన మంజుల షిత్యే.. తన సత్ప్రవర్తనతో అక్కడి జైలు అధికారుల దృష్టిలో పడింది. దీంతో అమెను జైలులోని ఓ బ్యారక్ కు వార్డెన్ గా ఎంపిక చేశారు. ఈ క్రమంలో గత శుక్రవారం ఉదయం అమె తన బ్యారక్ సభ్యుల బ్రేక్ ఫాస్ట్ (అల్పాహారం) తీసుకుని వెళ్తుండగా, రెండు ఉడకబెట్టిన కోడిగుడ్లు, ఐదు పావ్ ( బ్రెడ్డు ముక్కులు) తక్కువగా వచ్చాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో మేము గుడ్లను దొంగలించామా..? మాపై అభియోగాలను మోపుతావా..? అంటూ మంజులపై పాశవికంగా, అత్యంత దారుణంగా హింసించారు. లైంగికంగా అమానవీయంగా వ్యవహరించారు.
దీంతో జైలర్ ప్రత్యక గది నుంచి మంజుల భరించలేని నొప్పితో తన బ్యారాక్ లోని సెల్ లోకి చేరుకుందని జైలులోని మిగతా ఖైదీలు పేర్కోన్నారు. అనంతరం మరోమారు అమె సెల్ లోకి దూసుకోచ్చిన బిందు నైకేడీ, వసీమా షేక్, షీతల్ షీగొయంకర్, సురేఖా గుల్వే, ఆర్తి షింజ్నీ ఐదుగురు మహిళా కానిస్టేబుళ్లు.. అమెను మరోమారు దారుణంగా హింసించారని ఖైదీలు తెలిపారు. భిందు, సురేఖాలు ఇద్దరు మంజుల కాళ్లను పట్టుకుని ఎడంగా లాగగా, వసీమా తన లాఠీని అమె మర్మాంగంలోకి దూర్చి హింసించిందని ఖైదీలు అరోపించారు.
ఈ ఘటనతో మంజుల ఏడుపులు, పెడబొబ్బలు పెట్టిందని, అమె మర్మాంగాల నుంచి రక్తం కారుతున్నా అమెను పట్టించకున్న నాదుడే కరువయ్యడాని తెలిపారు. అధిక రక్తస్రావం కావడంతో మంజుల బాత్ రూమ్ లో సృహ కోల్పోయి పడిపోయిందని, దీంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది రెసిడెంట్ డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా, ఆయన అదేశాల ప్రకారంలో వెంటనే జెజే అస్పత్రికి తరలించారని తెలిపారు. కాగా, జెజే అస్పత్రిలో మంజుల షిత్యే చికిత్స పోందుతూ మరణించింది. బైకుల్లా జైలులో రాక్షసుల రాజ్యం నడుస్తుందని అరోపిస్తూ ఖైదీలందరూ అందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్న నగ్పాడ పోలిసులు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు కానిస్టేబుళ్లతో పాటు జైలర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
మహిళా ఖైదీని బ్యాటన్తో లైంగికంగా వేధించిన నేపథ్యంలో నాగ్పాడ పోలీసులు ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో.. ఈ క్రూరంగా హింసించి విషయాలు వెలుగు చూశాయి. ఖైదీలు తాము చూసిన విషయాలన్నింటినీ పోలీసు అధికారులకు చెప్పారు. దీంతో ప్రాథమిక చర్యగా ఐదుగురు కానిస్టేబుళ్లతో పాటు జైలు హెచ్ ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.. ఎఫ్ఐఆర్ పూరైన క్రమంలో వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more