సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై హిందూ అతివాదులు దాడికి యత్నించారు. యధేశ్ఛగా ఢిల్లీలోని సీపీఎం ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగులు.. మొదటి అంతస్థులో సీతరాం ఏచూరి నిర్వహిస్తున్న ప్రేస్ కాన్ఫరెన్స్ సభావేదిక వద్దకు వెళ్లి.. అప్పుడే అటుగా వస్తున్న ఏచూరీపై దాడికి యత్నించారు. వారిని గమనించిన సీపీఎం కార్యకర్తలు, పార్టీ నేతలు అడ్డుకోగా, పార్టీ కార్యాలయంలోనే వారు సీపీఎం ముర్తాబాద్ అంటూ.. నినాదాలు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. మీడియా సమావేశంలో పాల్గొనేందుకు నడుకుంటూ వస్తోన్న ఏచూరిపై హిందూసేనకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉపేందర్ కుమార్, పవన్ కౌల్ దాడికి యత్నించారు. సీతారం ఏచూరి వద్దకు సమీపిస్తున్న వారి పట్ల వెంటనే అప్రమత్తమైన సీపీఎం కార్యకర్తలు.. ఆ ఇద్దరినీ దొరకబుచ్చుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై అవిశ్రాంతంగా పోరాడుతున్నందునే హిందూ అతివాదులు ఈ తరహా దాడులకు తెగబడ్డారని సీపీఎం నేతలు అరోపించారు.
సీపీఎం నేత, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ జమ్మూకాశ్మీర్ లో మేజర్ లీటుల్ గొగోయ్ కు వ్యతిరేకంగా రాసిన కథనాన్ని వ్యతిరేకిస్తూ హిందూసేన కార్యకర్తలు ఈ దాడికి యత్నించారని హిందూ సేన చీఫ్ విష్ణు గుప్తా దాడి అనంతరం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కోన్నారు. అయితే వారి ఏచూరిపై దాడికి మాత్రమే యత్నించారని, కాగా సీపీఎం కార్యకర్తలు మాత్రం తమ కార్యకర్తలపై దాడికి కూడా పాల్పడ్డారని ఆయన అరోపించారు. అయితే ఎవరెన్నీ దాడులు చేసినా.. తాము భారత అర్మీకి వ్యతిరేకంగా ఎవరినీ వ్యాఖ్యానించబోనీయమని చెప్పారు.
కాగా, బీజేపి సంఘ్ పరివార్ గుండాలతో తమపై దాడులు చేయించినంత మాత్రన తాము కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానన్ని నిలపబోమని సీఫీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరీ తన ట్విట్టర్ ద్వారా చెప్పారు. తమపై దాడులకు యత్నించి మౌనంగా ఉంచాలన్న ప్రయత్నాలు సాగవని అన్నారు. భారత ప్రజల ఆత్మ సాక్షిగా సాగుతున్న యుద్దంలో తాము ఎట్టి పరిస్థితుల్లో వెరవబోమని చెప్పారు. కాగా ఏచూరిపై దాడికి యత్నించిన ఇద్దరనీ మందిర్ మార్గ్ పోలిస్ స్టేషన్ కు తరలించారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more