అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచస్థాయి గుర్తింపుపొందిన భారత్.. మరో కీలక మైలురాయిని అధిగమించేందుకు రంగం సిద్దం చేసుకుంది. కేఏ బ్యాండు, కేయూ బ్యాండ్ ట్రాన్స్ ఫాండర్లతో నింగిలోకి దూసుకెళ్లి 4జీ టెక్నాలజీని మరింత మెరుగుపర్చేందుకు మరో ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. భారీ ఉపగ్రహాలను సొంతంగా ప్రయోగించే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2 దశాబ్దాల కృషితో రూపొందించిన జియోసింక్రనస్ ఉపగ్రహ ప్రయోగ వాహకనౌక (జీఎస్ఎల్వీ)-మార్క్3డీ1 ను ఇవాళ సాయంత్రం 5.28 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది.
అధునాతన పరిజ్ఞనంతో నింగిలోకి దూసుకెళ్లనున్న ఉపగ్రహా పదేళ్ల పాటు సేవలను అందించనుండటంతో.. దానిని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టేందుకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం- షార్లో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ప్రయోగానికి ముందు నిర్వహించే కౌంట్డౌన్ ప్రక్రియ క్రితం రోజు మధ్యాహ్నం 3.58 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 25.30 గంటలపాటు కొనసాగిన అనంతరం షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి దూసుకెళుతుంది. పూర్తి స్వదేశీ తయారీ, ఇప్పటి వరకు ఇస్రో ప్రయోగించిన రాకెట్లలో కెల్లా అత్యంత పెద్దదైన ఈ జీఎస్ఎల్వీ.. 3,136 కిలోల బరువుగల జీశాట్-19 సమాచార ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.
జీఎస్ఎల్వీ-మార్క్3డీ1 డీటెల్స్..
రాకెట్ బరువు 640 టన్నులు. ఎత్తు 43 మీటర్లు. ఇందులో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో ఎస్200 మోటార్లు రెండు, రెండో దశలో ఎల్110 లిక్విడ్ కోర్ ఇంజిన్, మూడో దశలో సీ25 క్రయోజెనిక్ ఇంజిన్ ఉన్నాయి. ప్రయోగం అనంతరం 16.20 నిమిషాలకు జీశాట్-19 ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోనుంది. ఇది భూ అనువర్తిత బదిలీ కక్ష్య (జీటీవో)లోకి 4వేల కిలోలను, దిగువ భూ కక్ష్యలోకి 8వేల కిలోలను మోసుకెళుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more