భారతీయ రైల్వే సరికొత్త సదుపాయాన్ని తమ ప్రయాణికులు కల్పించేందుకు కసరత్తు చేస్తుంది. ఇప్పటికే రైలులో బోజనం సహా ఇతర క్రీయాశీలక సమస్యలపై దృష్టి సారింది.. వాటిని వేగవంతంగా పరిష్కరించిన రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు.. త్వరలో సరికొత్త సౌలభ్యాన్ని కూడా కల్పించేందుకు సంకల్పించారు. రైల్వే బోగీలలో ఒంటిరిగా ప్రయాణిస్తున్న మహిళలపై కీచకులు వెధింపులకు గురిచేసినా.. లేక తమ బిడ్డలకు పాలు కావాలన్న తల్లి అవేదనను అర్థం చేసుకున్న మంత్రి సకాలంలో అధికారులను స్పందింపజేసి.. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్యాబినెట్ లో అత్యత్తమ మంత్రిగా ఖ్యాతిని పొందారు.
తాజాగా ఆయన నేతృత్వంలోని రైల్వే శాఖ అన్ లైన్ ప్రయాణికులకు మాత్రం కొంత వెసలు బాటు కల్పించేందుకు కూడా సిద్దమైంది. అదేంటంటే ఇప్పుడు ప్రయాణించండీ.. 14 రోజులు (రెండు వారాల్లో) డబ్బును చె్లించండీ అనే కొత్త సదుపాయాన్ని కల్పించనున్నారు. ఈ మేరకు ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ త్వరలోనే ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సదుపాయం ద్వారా టిక్కటెల్ బుక్ చేసుకునే వారు వారి పేరు, ఈ మెయిల్, మొబైల్ నెంబరు, అధార్ కార్డు వివరాలు, పాన్ కార్డు వివరాలను తెలపాల్సి వుంటుంది.
దీంతో పాటు రైల్వే వెబ్ సైట్ ఇచ్చే వన్ టైం పాస్ వర్డ్ ను కూడా పరిగణలోకి తీసుకుని దాని అనుసంధానంతో టిక్కెట్లను బుక్ చేసుకోవాలి. అయితే ఈ సౌలభ్యం పోందగొరే ప్రయాణికులు 14 రోజుల వ్యవధి లోపు 3.5 శాతం సర్వీసు చార్జితో డబ్బు మొత్తాన్ని చెల్లించాల్సి వుంటుందని ఐఆర్ సిటీసీ అధికార ప్రతినిధి సందీఫ్ దత్తా తెలిపారు. ఇందుకోసం తాము ముంబైకి చెందిన ఈపే లేటర్ సంస్థతో టైఅప్ అయ్యామని చెప్పారు. దీనిని వినియోగించుకునే ప్రయాణికులు కేవలం ఐదు రోజుల ముందు మాత్రమే తమ టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి వుంటుందని కూడా తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more