స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని ఏర్పాడు చేసిన తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికపై నుంచి ఆ పార్టీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రమంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్ ను ప్రత్యర్థి పార్టీ స్వీకరించింది. తమ అధినేత జగన్ పై టీడీపీ జాతీయ స్థాయి నేతల నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు అవినీతి అంశం అంటూ విమర్శలు చేయడాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో వారికి లోకేష్ విసిరిన సవాల్ సరైన సమయంలో కలసివచ్చిందని భావించి అందుకు.. సై అనింది.
మంత్రి లోకేష్ అస్తులు వివరాలు ఏకంగా కోటాను కోట్ల రూపాయలకు ఎలా పెరిగాయన్న అంశంపై ఇప్పటికే వైసీపీ నేతలు ప్రచార అంశంగా మార్చారు. దీంతో మహానాడు వేదికగా సవాల్ విసిరిన లోకేష్ సవాల్ ను స్వీకరించిన వైసీపీ అవినీతిపై చర్చకు తాము సిద్దమని సంకేతాలను పంపింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ చర్చకు తాము సిద్దమని, ఇక వేదికను మాత్రం అధికార పార్టీయే ఖారారు చేసుకోవాలని చెప్పింది.
అయితే జగన్ పై విచారణ చేసిన సీబిఐ అధికారుల చేత లోకేష్ కూడా తనపై వచ్చిన సదావర్తి, దస్పల్లా హిల్స్, విశాఖ ల్యాంగ్ ఫూలింగ్ స్కామ్ లపై విచారణ జరపించుకోవాలని.. అప్పుడు వారే ఎవరు ఎంత అవినీతి పరులో తేల్చిచెబుతారని బోత్స అన్నారు. ఎవరి అవినీతి ఎంత.. గుడిని గుడిలోని లింగాన్ని మింగుతూనే.. ఎవరు నీతిమంతుల్లా ఫోజు కొడుతూ అన్నా హాజారే వారసులమని ప్రగల్భాలు పలుకుతున్నారో కూడా అందరికీ తెలుస్తుందని బొత్స తీవ్రస్థాయిలో విమర్శించారు.
రాజకీయాల్లో ఇంకా పిల్లకాకి లాంటి లోకేశ్కు ఆరాటం తప్ప,.. వ్యవహారం లేదని విమర్శించారు. తాత ఎన్టీఆర్లా నిక్కచ్చిగా మాట్లాడడం.. ఇచ్చిన మాటకు కట్టుబడి పనులు చేయడం నేర్చుకోవాలనే కానీ.. తండ్రి చంద్రబాబు నాయుడులా మసిబూసి మారేడు కాయలను చేసినట్లుగా మేనేజ్ మెంట్ కదాని ఆయన సూచించారు. ప్రభుత్వ ధనం, అధికార దుర్వినియోగంతో మూడు రోజులపాటు టీడీపీ జాతర చేసుకుందని ఆరోపించిన ఆయన… మూడు రోజుల పాటు జరిగిన మహానాడులో తెలుగు రాష్ట్రాలకు ఒరిగిందేం లేదని బొత్స సత్యానారాయణ విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more