పావురానికి పంజరానికి పెళ్ళి చేసె పాడులోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూఢలోకం ఒడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా.. అన్నట్లుగా పావురానికి డ్రగ్స్ కి ముడిపెట్టింది స్మగ్లింగ్ ముఠా.. వాళ్లు చేసిన తప్పులు తెలియక కేవలం తనతో పాటు బ్యాగ్ ను మోసుకెళ్లడం వల్ల అమాయక పావురానికి అరదండాలు పడ్డాయి. విచిత్రంగా వుందే అనుకుంటున్నా.. మీరు చదివింది నిజమే. ఒకప్పడు ప్రేమికులకు సందేశాలను పంపేందుకు వినియోగించిన పావురాలు.. ఆ తరువాత వేగులు పంపే సమాచారాన్ని తీసుకెళ్లేవి. తాజాగా స్మగ్లింగ్ ముఠా అదే మార్గాన్ని ఎంచుకుని అమాయక పావురాలను అరెస్టు చేయిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే. కువైట్ పోలీసులు ఎగరలేక కష్టపడుతున్న ఓ పావురాన్ని అరెస్టు చేశారు. కువైట్ సరిహద్దు ప్రాంతమైన ఇరాన్ నుంచి తమ దేశంలోకి వచ్చిన ఓ పావురం ఎగరడం కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యంది. అయినా కష్టపడుతూ తన గమ్యస్థానానికి చేరుకుంటుంది. దానిని గమనించిన కువైట్ పోలీసులు తొలుత దాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ అది కష్టంగా ఎగరడాన్ని గమనించిన తరువాత దానిని తీక్షణంగా గమనించారు. అయితే ఆ పావురానికి ఓ చిన్న బ్యాగు లాంటిది తగిలించి ఉండడాన్ని పోలీసులు గమనించారు.
దాంతో రంగంలోకి దిగిన పోలీసులు దానిని పట్టుకుని బ్యాగ్ విప్పి చూడగా అందులో డ్రగ్స్ వున్నాయి. దీంతో అక్రమంగా స్మగ్లింగ్ ముఠా డ్రగ్స్ ను పావురాల ద్వారా తరలిస్తున్నారని అనుమానంతో దానిని అరెస్టు చేశారు. దీంతో ఈ చర్యలకు ఇరాన్ నుంచి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముఠాలపై కూడా కేసు నమోదు చేసిన దర్యాప్తును ప్రారంభించారు. కాగా పావురాల ద్వారా ఇలా స్మగ్లింగ్ చేయించడం ఇరాన్ స్మగ్లింగ్ ముఠాలకు ఇది తొలిసారి కాదు. 2015లో కోస్టారికాకు చెందిన పోలీసులు ఎగరలేకపోతున్న ఓ పావురాన్ని పట్టుకున్నారు. తీరా చూస్తే దాని పొట్టకి కొకైన్ పొట్లాలు తగిలించి ఉండడం చూసి కంగుతిన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more