వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా బీజేపి పార్టీ జెండాను ఎగురవేయాలని పార్టీ నేతలకు సూచిస్తూ.. తెలంగాణ లోని నల్గోండ జిల్లాలో పర్యటించిన బీజేపి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై సీఎం కేసీఆర్ గరమయ్యారు. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని భావిస్తున్న బీజేపి.. దళితుల ఇంట్లో భోజనం ఎందుకు చేయాల్సి వస్తుందని.. ప్రశ్నించారు. బీజేపి దళిత వ్యతిరేక పార్టీ అన్న ముద్రను తుడిచివేసుకోవాలనే ప్రయత్నంలోనే ఇలా చేస్తున్నారని.. దళితుల ఇళ్లలో బోజనం చేస్తే వచ్చిన అపఖ్యాతి పోతుందా అని ఆయన ప్రశ్నించారు. దళితులపై దేశవ్యాప్తంగా ఓ వైపు దాడులు చేస్తూనే మరో వైపు బోజనాల పేరుతో బీజేపి వారిని మోసం చేస్తుందని దుయ్యబట్టారు.
దళితుల ఇళ్లలో బోజనం కూడా పూర్తిగా అబద్దంతోనే కూడుకున్నదని ఆయన విమర్శఇంచారు. పక్కనున్న కమ్మగూడెం లోని మనోహర్ రెడ్డి తోటలో వంటలు వండించి తీసుకువచ్చి.. దళితుల ఇంట్లో వాటిని వడ్డించారని అది కూడా దళితుల ఇంట బోజనం ఎలా అవుతుందని కేసీఆర్ ప్రశ్నించారు. దళితుల ఇంట్లో బోజనం అంటే వారితో కలసి చేయాలే తప్ప.. వారిని నిల్చోబెట్టి. అమిత్ షా సహా పలువురు నేతలు కూర్చోని తినడం దళితుల ఇంట బోజనం ఎలా అవుతుందని ఆయన నిలదీశారు. సోషల్ మీడియాలో విమర్శలకు బయపడి ఇవాళ బీజేపి నేతలు దళితుల ఇళ్లలో బోజనం చేస్తున్నారని విమర్శించారు.
దళితుల ఇళ్లలో బోజనం చేసినంత మాత్రాన అది దళిత పార్టీ అయిపోతుందా..? అని ప్రశ్నించారు. అసలు బీజేపి కూడా ఒక పార్టీయేనా అని ఆయన వ్యంగంగా నిలదీశారు. బీజేపి పార్టీ సత్తా ఏంటో జీహెచ్ఎంసీ ఎన్నికలలో తేలిపోయిందని.. ఎంఐఎం ఉన్న ప్రాంతంలో ఒక్క సీటు కూడా బీజేపి గెలువలేక పోయిందని సీఎం దుయ్యబట్టారు. తెలంగాణ పర్యటనలో అమిత్ షా వల్లెవేసిన అబద్దాలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తాను చెప్పిన లెక్కలే తప్పని నిరూపించాలని ఆయన సవాలు విసిరారు. తాను చెప్పిన లెక్కలు అసత్యాలని నిరూపిస్తే రాజీనామా చేస్తానని ప్రకటించారు.
గతంలో తెలంగాణ పర్యటన సందర్భంగా కూడా అమిత్ షా పలు వ్యాఖ్యలు చేశారని, తెలంగాణకు రూ.95 వేల కోట్లు ఇచ్చినట్లు అప్పట్లో అన్నారని చెప్పారు. ఇప్పుడు కూడా అమిత్ షా ఇటువంటి వ్యాఖ్యలే చేస్తున్నారని, అప్పుడు లైట్ గా తీసుకుని వదిలేశామని, ఇప్పడు అదే అబద్దాలను ప్రచారం చేయడం ఒక జాతీయ పార్టీకి సముచితమా..? అని నిలదీశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తెలుసుకోకుండా, అభివృద్ధి లేదంటూ మాట్లాడుతున్నారని అన్నారు. అమిత్ షా ఈ సారి కూడా అద్భుతమైన అబద్ధాలు వల్లెవేశారని ఎద్దేవా చేశారు.
దేశాన్ని పరిపాలించే పార్టీకి అధ్యక్షుడైన అమిత్ షా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. దేశంలో ఏ పార్టీ అయినా తెలంగాణలో బలం పెంచుకోవచ్చని, అయితే, అసత్య ప్రచారం చేయకూడదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మంచిచెడ్డలు ప్రజలు నిర్ణయిస్తారని హితవు పలికారు. వాస్తవాలు ఏంటో జనాలకి తెలుసని అన్నారు. దేశంలోనే ధనిక రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ ఉందని, తెలంగాణ ప్రభుత్వ పాలసీలన్నీ అద్భుతంగా ఉన్నాయని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల బాగోగుల కోసమే తమ కృషి అని అన్నారు. తననువ్యక్తిగతంగా మాటలు అన్నాపడతాను.. కానీ తెలంగాణ వ్యవస్థనే కించపరుస్తూ మాట్లాడితే తన ప్రాణం పోయినా ఊరుకోనని కేసీఆర్ అన్నారు. కాగా రాష్ట్రపతి ఎన్నికలపై ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేసీఆర్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more