గచ్చిబౌలిలోని షా గౌస్ హోటల్ లో శునకం మాంసాన్ని వడ్డివారుస్తున్నారని ఆ మద్య సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ కథనం తీవ్ర దుమారాన్ని లేపింది. అయితే దీనిపై ఏకంగా హోటల్ యాజమాన్యం స్పందించి పోలీసులకు పిర్యాదు చేయడంతో.. ఈ కథనానికి కారణమైన బిజినెస్ స్కూల్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. తన స్నేహితులు తనను వదిలి వెళ్లి బిర్యాని తినడానికి వెళ్లడంతో వారిని అటపట్టించేందుకు ఈ విధమైన ఫేక్ న్యూస్ ను తాను కేవలం వారికి మాత్రమే పంపానని, అది కాస్తా క్షణాల్లో వైరల్ అవుతుందని తాను ఊహించలేదని తెలిపాడు నిందితుడు.
సరిగ్గా అలాంటి ఫేక్ న్యూస్ తో ఇప్పుడు లండన్ లో ఇండియన్ రెస్టారెంట్ మూతపడింది. ఆరు పదులు దాటి.. మంచి రుచితో. సుచితో స్థానికుల మనన్నలు పోందిన హోటల్ లో ఏకంగా నరమాంసం.. అదేనండీ మనిషి మాంసం వండుతున్నారన్న సోషల్ మీడియా కథనాలతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏకంగా రెస్టారెంట్ ను మూసేశారు. దీనికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఫేక్ న్యూసే కారణం.
వివరాల్లోకి వెళ్తే..దక్షిణ లండన్ లో నిర్వహిస్తున్న కర్రీట్విస్ట్ రెస్టారెంట్ లో నరమాంసం వండివారుస్తున్నారని ఫేక్ న్యూస్ వైరల్ అయ్యింది. దీంతో ఆ రెస్టారెంట్ యజమానురాలు షిన్రా బేగం పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ తప్పుడు వార్తను నమ్మిన కొందరు తమ హోటల్ ను ధ్వంసం చేస్తామని ఫోన్ ద్వారా హెచ్చరించడంతో ముందుజాగ్రత్త చర్యగా పోలీసులకు పిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఇది ప్రాంక్ న్యూస్ సైట్ నుంచి గుర్తుతెలియని అగంతకులు సృష్టించిన ఫేక్ న్యూస్ గా కనుగోన్నారు.
ఈ నేపథ్యంలో యజమానురాలు షిన్రా బేగం మాట్లాడుతూ.. పోలీసుల ఎదుట కూడా ఓ వ్యక్తి తమ హోటల్ తెరిస్తే కిటికీలు ధ్వంసం చేస్తానని హెచ్చరించాడని తెలిపారు. ఇక మరికోందరు ఏకంగా పోలీసులకే ఈ విషయమై పిర్యాదు చేశారని అన్నారు. ఈ తప్పుడు కథనాల వల్ల తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని అన్నారు. ఇక మరికోందరు తమకు ఫోన్ చేసి మరీ మనుషి మాంసం వడ్డించడానికి మీకెంత ధైర్యం అంటూ నిలదీస్తున్నారని కూడా తెలిపారు.
తమ హోటల్ కు 60 ఏళ్ల చరిత్ర ఉందన్న విషయాన్ని కూడా కస్టమర్లు పరిగణలోకి తీసుకోకుండా.. ఎవరో ఏదో రాస్తా.. దానిని మాత్రమే ప్రచారం చేస్తూ.. తమను బెదిరించడమే పనిగా పెట్టుకున్నారని షిన్నా బేగం అవేదన వ్యక్తం చేశారు. ఒక పంక్తిలో చిన్న పారాగ్రాప్ రాసి.. అందులోనూ అక్షరదోషాలు, వ్యాకరణ దోషాలు వుంటూ దానిని నమ్ముతున్నారని అమె విస్మయం వ్యక్తం చేశారు.
మనిషి మాంసం వడ్డిస్తున్న అసియా రెస్టారెండ్ మూతపడింది అన్న శీర్షికతో ఈ న్యూస్ వచ్చిందని అమె తెలిపారు. నరమాంసాన్ని వండివారుస్తున్నారన్న అరోపణలపై హోటల్ యజమాని రార్జన్ పటేల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఈ సందర్భంగా వారు తయారు చేస్తున్న అహారంలో మనిషి మాంసం కలుపుతున్నారన్న పోలీసులు కనుగోన్నారని దీంతో న్యూక్రాస్ రెస్టారెంట్ ను పోలీసులు సీజ్ చేశారని వార్త కథనం. పోలీసులు పరిశీలనలో మరో తొమ్మిది మానవ మృతదేహాలు ఫ్రిజ్ లో వున్నాయని.. అవి కూడా మాంసంగా మారేందుకు సిద్దమైనట్లు వున్నాయని తెలిసి వాటిని పోలీసులు స్వాథీనం చేసుకున్నారని కూడా కథనంలో వుంది.
అంతేకాదు హోటల్ సీజ్ చేసిన పోలీసులు రర్జన్ పటేల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని ఈ నేపథ్యంలో హోటల్ ను మూసివేశారని కూడా ఆ ఫేక్ న్యూస్ లో వుండటం గమనార్హం. అయితే ఈ ఫ్రాంక్ న్యూస్ సైట్లో అనేక తప్పుడు కథలు ప్రచారంలో వుంటాయని.. ఇలా తమ రెస్టారెంట్ పై కథనం ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి తమకు కస్టమర్లు రావడం లేదని, నిత్యం బిజీగా వుంటే హోటల్ లో ఇప్పుడు సిబ్బందికి పనిలేక కూర్చుంటున్నారని షిన్రా బేగం తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more