పాకిస్థాన్ లో ఓ శునకం రోజులు లెక్కబెట్టుకుంటుంది. ఏకంగా ఓ కుక్కకు మరణ దండన విధించిన విచిత్ర ఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తూనే.. నవ్వులు పూయిస్తున్న ఈ ఘటనను అ దేశానికి చెందిన జియో టీవీ ప్రముఖంగా ప్రసారం చేసింది. ఈ ఘటన పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో గల భక్కర్ రోలార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ బాలుడిని తీవ్రంగా గాయపరిచిందన్న ఆరోపణలపై అసిస్టెంట్ కమిషనర్ రాజా సలీం ఓ కుక్కకు మరణదండన విధించారు.
ఈ మేరకు అసిస్టెంట్ కమిషనర్ రాజా సలీం ఆదేశాలను జారీ చేస్తూ, బాధిత బాలుడు తీవ్రంగా గాయపడినందున దోషి అయిన శునకానికి మరణశిక్ష విధిస్తున్నట్టు తెలిపారు. మానవత్వా దృక్పథంతోనే తాను ఈ అదేశాలను జారీ చేశానని, చెప్పిన ఆయన అధికారులు ఆ శునకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలను సక్రమంగా పరిశీలించి ఆనక మరణదండణ విధించాల్సిందిగా అదేశించారు. కాగా అసిస్టెంట్ కమీషనర్ రాజా సలీం అదేశాలపై శునకం యజమాని జమీల్ ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే రాజా సలీం అదేశాలను ఆయన సవాల్ చేస్తూ సివిల్ కోర్టును ఆశ్రయించిన శునక యజమాని.. తన పెంపుడు జంతువును బాలుడ్ని కరిచిందన్న అరోపణలపై దానిని గత వారం రోజులుగా జైలులోనే వుంచారని, అది చాలదన్నట్లు ఇప్పుడు తాజాగా దానికి మరణ దంఢన విధించడం సబబు కాదని వాదిస్తున్నారు. తమ శునకాన్ని శాశ్వతంగా దూరం చేయడం తగదని అయన సివిల్ కోర్టులో దాఖలు చేసిన అపీలులో పేర్కోన్నారు. తన శునకాన్ని దక్కించుకోవడం కోసం తాను ఎన్ని న్యాయస్థానాలకైనా వెళ్తానని శునక యజమాని జమీల్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more