దేశ రాజధాని ఢిల్లీలోని ఓ మెట్రో రైలులో ఓ మహిళ తన చోక్కాను విప్పేసి.. మీరు పోట్లాడుతారా..? రండి అంటూ సవాల్ విసిరింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్ లో వైరల్ గా మారింది. ఢిల్లీ శివారు గ్రేటర్ నోయిడా సహా పలు ప్రాంతాలలో ఆఫ్రికా వాసులపై జరిగిన జాతి వివక్ష దాడులు ఇటీవల వెలుగు చూడటం.. వాటిపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా విచారణకు అదేశించడం, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్ నిష్పక్షపాత విచారణ జరిపిస్తామని హామీలు ఇవ్వడం జరిగినా.. ఇంకా అఫ్రికన్లపై మాత్రం జాతి వివక్ష కొనసాగుతూనే వుంది.
తాజాగా ఢిల్లీ మెట్రో రైలులో ఓ ఆఫ్రికన్ మహిళ షర్ట్ విప్పేసి తనతో గొడవపడిన వారిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇద్దరు ఆఫ్రికన్ మహిళలు మెట్రో రైలులో వెళ్తుండగా సీటు లభించని కారణంగా వారు తోటి ప్రయాణికులతో వాదనకు దిగారు. రైలులో మహిళల కంటే యువకులే ఎక్కువగా ఉన్నా తమకు కూర్చునేందుకు సీటు ఇవ్వకపోవడంపై వారు మండిపడ్డారు. వారికి కేటాయించిన సీట్లలో కూర్చునేందుకు వారిని అనుమతించక పోవడంతో వాదన మొదలైంది. దీంతో ఆఫ్రికన్ మహిళలు ఇద్దరూ అక్కడున్న మిగతా ప్రయాణికులతో వాదనకు దిగారు. కాసేపటి తర్వాత ఒకామె మరో మహిళను సీటులో కూర్చోబెట్టింది.
అతర్వాత కూడా మహిళలకు, యువకులకు మధ్య గొడవ జరుగుతూనే ఉంది. వీరిద్దరినీ బయటకు తోసేయండి అంటూ కొందరు యువకులు అన్నారు. దీంతో ఇదేనా మీ ప్రవర్తన.. మహిళలతో ఇళాగే నడుచుకుంటారా..? అంటూ మరో మహిళ ప్రయాణికులపై మండిపడింది. అంతటితో అగకుండా తన షర్ట్ విప్పేసి కొట్లాటకు రండి అంటూ యువకులను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. కొందరు జోక్యం చేసుకుని మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం తతంగాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా హల్ చల్ చేస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more