అప్రతిహాత విజయాలతో అనేక మైలురాయిలను దాటుకుంటూ.. విజయాలను తన సిగలో మల్లెల మాదిరిగా తీర్చిదిద్దకుంటున్న ఇస్రో.. తాజాగా ప్రయోగించిన జీశాట్ ఎఫ్09 ఉపగ్రహ ప్రయోగాన్ని కూడా విజయవంతమైంది. నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ పెంటర్ నుంచి సరిగ్గా సాయంత్రం 4 గంటల 58 నిమిషాలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన వాహన నౌక నిర్ణీత వ్యవధిలో నిర్ణత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించి క్రితం రోజు మధ్యాహ్నం 12 గంటల 57 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఈ వాహన నౌక ద్వారా 2,230 కిలోల బరువు కలిగిన విశాట్–9(దక్షిణాసియా దేశాల శాటిలైట్) ఉపగ్రహాన్ని భూమికి 36వేల కి.మీ ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టా. ఈ ఉపగ్రహంలో 12 కేయూ బ్రాండ్ ట్రాన్స్ఫార్మర్స్ను అమర్చారు. దక్షిణాసియా దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులు దేశాలకు ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సమాచార వ్యవస్థకు సంబంధించిన సేవలను అందించనుంది. జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇది 11వ ప్రయోగం కావడం విశేషం. ఈ సమాచార ఉపగ్రహం తయారీకి ఇస్రో రూ.235కోట్లు ఖర్చు చేసింది. మొత్తం ఈ ప్రాజెక్టుకు రూ.450కోట్లు వెచ్చించింది.
ఇస్రో సాధించిన మరో విజయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో మరో చరిత్రాత్మక ప్రయోగంలో విజయవంతంగా పూర్తి చేసిందని ఆయన అన్నారు. ప్రధాని మోదీ దక్షిణాసియా అగ్రనేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సార్క్ దేశాల సదస్సలో భారత్ ఆయా దేశాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు అయ్యిందని ప్రధాని అన్నారు. దక్షిణాసియా దేశాలన్నీ ఒక ఉమ్మడి కుటుంబంలా ఉన్నాయని మోదీ అభివర్ణించారు. ఈ ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్, డీటీహెచ్ సేవలను పొందవచ్చని, అత్యాధునిక సమాచార వ్యవస్థను అందుకోవచ్చని తెలిపారు. ఈ ప్రయోగం జరిగిన రోజు చారిత్రాత్మమైనదిగా అభివర్ణించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more