అధికారంలోకి వచ్చే ముందు అన్ని పార్టీలు సామాన్యులను, మద్యతరగతి వర్గాల వారిని దువ్వుకోవడం పరిపాటి. కానీ అధికారంలోకి వచ్చిరాగానే ఆ వర్గాలను ముందుగా టార్గెట్ చేసి.. వారికి ఓ చేత్తో చిటికెడు ఇచ్చినట్లే ఇచ్చి. మరో చేత్తో గుప్పెడు లాగేసుకుంటున్నాయి. అంతర్జాతీయంగా బీజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి వున్న పరిస్థితులకు తాజాగా ఇప్పుడన్న పరిస్థితులకు ఏ మాత్రం వ్యత్యాసం వుందో అందరకీ తెలిసిందే, ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చి రాగానే అంతర్జాతీయంగా చమురు ధరల దిగివచ్చాయి.
కానీ ఆ లాభాలను మాత్రం అస్వాధించే అవకాశం ప్రభుత్వాలు కల్పించడం లేదు. ఎలాగో ప్రజలు అలావాటు పడ్డారని అనుకుంటున్నారో లేక.. ఇక ఆదాయాన్ని రాబట్టుకోవడమే మూలకారణం అని భావస్తున్నాయో తెలియదు కానీ ప్రజలపై మాత్రం భారం మోపుతున్న చమురు సంస్థలకు అమోదం తెలిపేస్తుంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా అంతర్జాతీయ రేట్లకు అనుగూణంగానే ధరలను నిర్ణయం జరుగుతుందని చెబుతున్న కేంద్రం.. ఈ రెండున్నరేళ్ల కాలంలో వేసిన ఎక్సైజ్ పన్నును మాత్రం తగ్గించకుండానే మధ్యతరగతి, సామాన్య ప్రజలపై భారం మోపుతుంది.
తాజాగా, కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఇంధన సంస్థలు ఇటు గ్యాస్ సబ్సీడీ సిలిండర్ ధరను కూడా పెంచేశారు. సబ్సీడి సిలిండర్ పై రూ. 2 పెంచగా, అటు పేద ప్రజలు వినియోగించే కిరోసిన్ ధర 26 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తాజా ధరలతో 14.2 కేజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 440.90 నుంచి రూ. 442.90కి చేరింది. కిరోసిన్ ధర 19.55కి చేరింది. ప్రతినెల 25 పైసలు పెంచి.. కిరోసిన్ పై సబ్సిడీని తొలగించాలని ధరలను పెంచుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు రేషన్ షాపుల్లో లభించే కిరోసిన్ కోటాను కూడా సగానికి తగ్గించేసింది.
పేద వర్గాలకు, అది కూడా ప్రభుత్వం ఇచ్చిన బీపీఎల్ కార్డుదారులకు మాత్రమే లభించనున్న నాలుగు లీటర్ల కిరోసిన్ ఇకపై కేవలం రెండు లీటర్లకు మాత్రమే పరిమితం కానుంది. ఇక సబ్సిడీ లేని వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.92 తగ్గించి సంపన్నవర్గాలకు చమురు సంస్థలు తీయటి కబురునందించాయి. జెట్ ఇంధన ధర 0.4 శాతం తగ్గించారు. చమురు ధరలు, విదేశీ మారక విలువల రేటు ఆధారంగా.. ప్రతి నెల ఒకటో తేదీన అంతర్జాతీయ చమురు ధరలకనుగుణంగా వంట గ్యాస్, జెట్ ధరలను పెంచుతున్నాయి చమురు కంపెనీలు. ఏప్రిల్ 1న సబ్సిడీ సిలిండర్ ధరను రూ. 5.57లు పెంచాయి చమురు కంపెనీలు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more