అధార్ ను అప్షనల్ గా మాత్రమే సరిగణలోకి తీసుకోవాలని తాము ఇచ్చిన అదేశాలను ఉల్లంఘించి తప్పని సరి చేస్తారా..? అప్షనల్ అంటే అర్థం తప్పనిసరి అనా..? అని స్వయంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన నేపథ్యాన్ని మర్చిపోయిన ప్రభుత్వాలు మరోమారు ఆధార్ ను అసుసంధానంగా చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నాయి. అయితే ఈ సారి కేంద్ర ప్రభుత్వం బదులుగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలకే ముడిపడిన ఆధార్ ఇకపై మరిన్నీంటికీ అధారంగా మారనుంది.
ఇకపై పెళ్లిళ్లకు తప్పనిసరి చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. రిజిస్ట్రేషన్ వివాహాల్లో ఆధార్ను తప్పనిసరి చేయాలని తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది. వివాహాలను డిజిటలైజ్ చేయడంలో భాగంగా వధూవరుల వివరాలతోపాటు వారి ఆధార్ నంబర్లు, వేలిముద్రలు సేకరించాలని నిర్ణయించింది. దీని వల్ల రెండో పెళ్లిళ్లకు చెక్ పెట్టవచ్చని భావిస్తోంది. అయితే ఇది కేవలం రిజిస్ట్రేషన్ పెళ్లిళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆయా మతాచారాల ప్రకారం బయట జరుపుకునే వివాహాలకు ఇది వర్తించదు.
ప్రస్తుతం తెలంగాణలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెళ్లిళ్లను రికార్డ్ చేస్తున్నారు. ఈ కార్యాలయాల్లో రెండు రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. వధూవరులు వచ్చి పెళ్లి చేయాలని కోరితే నెల రోజుల్లో వారికి వివాహం జరిపించి ధ్రువపత్రం ఇవ్వడం అందులో మొదటిది కాగా, బయట పెళ్లి చేసుకుని మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వివాహ ధ్రువీకరణ పత్రం ఇవ్వడం రెండోది. ఈ వ్యవహారమంతా మాన్యువల్గా జరుగుతోంది. వారు చేసుకున్న దరఖాస్తులను తీసుకుని రిజిస్టర్లో వివరాలు నమోదు చేస్తున్నారు.
దీంతో ఎవరైనా రెండో పెళ్లి చేసుకుంటే పట్టుకోవడం కష్టంగా మారుతోంది. కొందరు రెండుమూడు సార్లు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా పట్టుబడడం లేదు. ఈ కారణంగానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సమయంలో వధూవరుల నుంచి ఆధార్ నంబర్, వారి ఫొటోలు, వేలిముద్రలు అన్నీ సేకరించి ఆన్లైన్లో భద్రపరుస్తారు. ఇలా చేయడం వల్ల రెండో పెళ్లిళ్లకు చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. తొలుత ఈ విధానాన్ని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more