పొరుగు రాష్ట్రం నుంచి నగర పర్యటనకు వచ్చిన ఓ పర్యాటకురాలి ముందు నగరంపై వున్న అభిమానం పోవడంతో పాటు ప్రపంచ పటంలో నిలిచే నగరమని గర్వంగా చెప్పుకుంటున్నా.. పరువు మాత్రం పోయింది. అమెకు ఓ క్యాబ్ డ్రైవర్ అమె పట్ల వికృతంగా ప్రపవర్తించి.. మరీ అమెకు చేదు అనుభవం ఎదురైయ్యేలా చేశాడు. అమెతో పాటు అమె తల్లిదండ్రులు.. బంధువులు వున్నా.. వాడి అగడాలు మాత్రం అగలేదు. పరాయి రాష్ట్రం నుంచి వచ్చారు. తానెమన్నా పడతారు అనుకున్నాడు కాబోలు.. వక్రబుద్దితో వ్యవహరించాడు.
బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీపి (క్రైం) స్వాతి లక్రా.. నగరం పరువు తీస్తే.. ఊరుకుంటామా..? తాట తీస్తాం అన్నట్లు నిందితుడికి హెచ్చరికలు ఇచ్చారు. అతిధులను అప్యాయతతో పలుకరించాలని, వారి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని.. అమె సూచించారు. ఇళ్ల వద్ద పోరుగింటివారితో వ్యవహరించినట్లు దేశంలోని ఇతర రాష్ట్ర పర్యాటకులతో మెలగాలని, ఇక పరదేశ పర్యటకులు మన అతిధులని వారితో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అమె ఈ సందర్భంగా క్యాబ్ డ్రైవర్లకు సూచించారు.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన ఓ మహిళ గత వారం కుటుంబీకులతో నగర పర్యటనకు వచ్చారు. సిటీకి చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ నుంచి క్యాబ్ను ఎంగేజ్ చేసుకున్నారు. ఈ వాహనానికి పహాడీషరీఫ్కు చెందిన నలభై ఏళ్ల మహ్మద్ సలీం డ్రైవర్గా వచ్చాడు. పర్యటన అనంతరం తిరిగి వెళ్లేందుకు అంతా రైల్వే స్టేషన్కు బయలుదేరారు. బాధితురాలు డ్రైవర్ పక్క సీటులో కూర్చోగా... కుటుంబీకులు వెనుక సీట్లో కూర్చున్నారు. అదే అదనుగా భావించిన సలీం.. అమెను లైంగికంగా వేదించాడు.
రైల్వే స్టేషన్ కు వెళ్తున్న దారిలో డ్రైవర్ సలీం పర్యాటకురాలిపై వికృతంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. తీవ్ర జుగుప్సకు లోనైన బాధితురాలు కారు ఆపమని చెప్తున్నా పెడచెవిన పెట్టి అలాగే కారును నడిపించాడు. సలీం వికృత చేష్టలు శృతిమించుతున్న తరుణంలో సదరు మహిళ చివరకు బలవంతంగా కారు ఆపించి కిందికి దిగారు. తన పట్ల అనుచితంగా వ్వవహరించిన డ్రైవర్ గురించి తన తండ్రితో పాటు బంధువుకు విషయం చెప్పారు. వారు ప్రశ్నిస్తుండగానే.. లగేజ్ను నడిరోడ్డుపై పడేసిన క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి ఉడాయించాడు.
దీనిపై బాధితురాలు అప్పుడే ట్రావెల్స్ నిర్వాహకులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ వారు సలీంపై ఎలాంటి చర్యలు తీసుకునేట్లు లేరన్న అనుమానం అమెలో ఎక్కడో వుండింది. దీంతో క్యాబ్ డ్రైవర్ కు తప్పక తగిన శిక్ష పడాలని భావించిన మహిళ.. పోలీసులకు పిర్యాదు చేయాలని భావించారు. కాగా, రైలు మిస్ అవుతుందన్న.. సమయాభావంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బెంగళూరు చేరుకున్న తర్వాత షీ–టీమ్స్ గురించి తెలుసుకున్న అమె.. వారికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more