దేశ ప్రజలపై ఇప్పటికే స్వచ్చా భారత్, మహిళా శిశు కల్యాణ్ పథకాల పేరుతో 14 శాతం మేర వున్న పన్నును కాస్తా 15 శాతానికి పెంచుతూ భారాన్ని వేసిన కేంద్ర.. ఇకపై మరింత పన్ను భారాన్ని వేయాలని భావిస్తుందా..? పన్నుపోటుతో ప్రజల నడ్డీ విరిచేందుకు సిద్దమైందా..? అంటే అవుననే సమాధానాలే వినపిస్తున్నాయి. మరో మూడు మాసాల్లో అమలుకు నోచుకోన్న కొత్త పన్ను విధానం వస్తు సేవల పన్ను (జిఎస్టి)తో పన్నుల బాదుడు కేంద్రం సిద్దమైందని తెలుస్తుంది.
చిటికెడు తాయిలం ఇచ్చి.. గుప్పెడు వస్తువులపై పన్నుల భారం పెంచేందుకు కేంద్రం సిద్దమైందన్న వార్తులు జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. వీలైనన్ని ఎక్కువ వస్తువులపై ఏదో ఒక రూపంలో ప్రభుత్వం పన్నుల భారం మోపేందుకు రెడీ అవుతుందని, దీంతో ప్రజల జేబులకు చిల్లులు పెట్టబోతోందని జాతీయ పత్రికలు కథనాలను ప్రచురిస్తున్నాయి. వస్తు సేవా పన్నులో ధరల పెంపు జాబితాలో సినిమా టిక్కెట్లు, హోటల్ బిల్లు, టెలిఫోన్ బిల్లులు, కేబుల్ టీవీ బిల్లు, బీమా పాలసీలపై ప్రీమియం చెల్లింపు, బ్యూటీపార్లర్, ఎటిఎం, డెబిట్, క్రెడిట్ కార్డులపై చెల్లింపులు, కొరియర్ సేవలు, లాండ్రీ సర్వీసులతో సహా దాదాపు 100 రకాల నిత్య వినియోగ సేవలు మరింత ప్రియం కాబోతున్నాయి.
ఈ మేరకు కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా సంకేతాలు ఇచ్చారు. సర్వీస్ టాక్స్పై ఆయన వెల్లడించిన విషయాలు వస్తువుల పన్ను భారాన్ని పెంచుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం 15 శాతంగా ఉన్న సర్వీస్ టాక్స్ను మరో మూడు శాతం పెంచి జిఎస్టి హయాంలో 18 శాతంగా చేసే యోచన ఉందని అధియా వ్యాఖ్యానించారు. వచ్చే నెల 18-19 తేదీల్లో శ్రీనగర్లో జరిగే సమావేశంలో జిఎసటి కౌన్సిల్ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఏటా రూ.20 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యాపారులు జిఎస్టి కింద పేర్లు నమోదు చేసుకోవాల్సిన అవసరంలేదని అధియా చెప్పారు. దీంతో వీరు ఎలాంటి సర్వీస్ టాక్స్ చెల్లించాల్సిన అవసరంలేదని వివరణ ఇచ్చారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం వార్షిక టర్నోవర్ రూ.10 లక్షలు దాటే వ్యాపారులు అందరూ సర్వీస్ టాక్స్ చెల్లించాలి. జిఎ్సటి కింద ఈ మినహాయింపు పరిమితి రూ.20 లక్షలకు పెరగనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more