షిరిడీ సాయిబాబా భక్తులు వేయి కళ్లతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. ఎట్టకేలకు కేంద్ర విమానయాన సంస్థ సాయిబాబా భక్తులకు శుభవార్తను అందించింది. వచ్చే నల నుంచి షిరిడీకి విమానయాన సేవలు ప్రారంభం కానున్నాయి. మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, దేశ అర్థిక రాజధాని ముంబై, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లాంటి ముఖ్యనగరాలకు చెందిన ప్రయాణికులకు సాయి ధర్మనం మరింత వేగంగా కానుంది.
ఇప్పటి వరకు కేవలం రైలు, రోడ్డు మార్గాల ద్వారా మాత్రమే భక్తులు షిరిడీకి చేరుకుంటున్న తరుణంలో.. ఇక వచ్చే నెల నుంచి వాయుమార్గం కూడా అందుబాటులోకి రానుంది. దీంతో ఇక భక్తులు ఎంత కాలంగానో ఎదురుచూస్తున్న మార్గం కూడా అందుబాటోలకి రావడంతో ఇకపై షిరిడీకి కూడా భక్తుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఈ విమానాశ్రయాన్ిన మహారష్ట్రా ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ కంపెనీ లిమిటెడ్ ఎంఏడీసీ నిర్వహించనుంది.
రైలు రోడ్డు మార్గాల ద్వారా అత్యధిక సమయం ప్రయాణాల కోసమే వినియోగిస్తున్న భక్తులు ఇందులో కొంద ఇబ్బందులను కూడా ఎదుర్కోంటున్నారు. అయితే ఇక వాయుమార్గం కూడా అందుబాటులోకి రావడంతో ఇక రివ్వును ఎగురూకుంటూ సాయి సన్నిధికి చేరుకోనున్న భక్తులు మళ్లీ అదే వాయువేగంతో తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం కేవంల దేశీమ విమానాలను మాత్రమే ఇక్కడి నుంచి రాకపోకలను సాగించనున్నాయి. భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాలు కూడా నడిపే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మాత్రం కేవలం ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ విమానాశ్రయాలకు మాత్రమే సర్వీసులు నడవనున్నాయని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more