ఊహించిందే జరిగింది. ఆర్కే నగర్ ఉపఎన్నికకు సంబంధించి ఓటుకు నోటు వ్యవహారం వెలుగులోకి రావటం తమిళనాడులో కలకలం రేపింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు నిర్ణయించుకున్న ఎన్నికల సంఘం ఈ బుధవారం జరగాల్సిన ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆదివారం అంతా భేటీలు నిర్వహించిన ఎన్నికల ప్యానెల్ రాత్రి 10.30 తర్వాత నిర్ణయం ప్రకటించింది.
అధికార అన్నాడీఎంకే ఈ ఎన్నికల కోసం రూ. 90 కోట్ల మేరకు ఓటర్లకు పంచిందన్న ఆరోపణలు వెలువడ్డాయి. దివంగత సీఎం జయలలిత మరణానంతం వారసత్వం కోసం జరుగుతున్న పోరు కావటంతో శశికళ వర్గం ఈ దిగజారుడు చర్యకు దిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటుకు 4 వేల చొప్పున మొత్తం 89 కోట్ల రూపాయిలు చెయ్యి మారినట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో డబ్బులు ప్రవహిస్తున్నాయంటూ ఐటీ శాఖకు ఉప్పందించటం, వారు ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, నటుడు శరత్ కుమార్, ఇంకొందరికి చెందిన 32 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరపటం, పెద్ద ఎత్తున్న డబ్బు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం భారీ స్థాయిలోనే ఉండొచ్చని భావించిన అధికారులు ఈసీకి ఓ నివేదిక పంపారు. గత ఏడాది తంజావురు, అరవకురిచి నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఇలాంటి ఆరోపణలే రాగా వాటిని కూడా వాయిదావేసిన సంగతి తెలిసిందే.
మొత్తం ఏడుగురు మంత్రులు 35 ప్రదేశాల్లో ఈ తతంగం నడిపించినట్లు సమాచారం. ఈ ఓటుకు నోటు వ్యవహారంతో శశికళ వర్గానికి చెందిన ముఖ్యమంత్రి పళని స్వామికి ఇబ్బందులు మొదలైనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more