అమెరికాలో మరో దారుణం జరిగింది. భారతీయ యువకుడిపై అక్కడి అగంతకులు కాల్పులకు తెగబడ్డారు. డొనాల్ట్ ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారతీయులుపై వరుస దాడులు, హత్యలు ఆడగం లేదు. సాఫ్ట్ వేర్ ఇంజనీరు కూచిబోట్ల శ్రీనివాస్ హత్యోందంతం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి అనేక మంది భారతీయులు జాత్యహంకార దాడులకు గురవుతున్నారు. ఈ క్రమంలో పలువురు భారతీయులు జాతివిద్వేషాలకు అసువులు బాయగా, మరికోందరు దాడులకు గురూ ప్రాణాలతో మిగిలారు.
తాజాగా అమెరికాలోని వాషింగ్టన్ లో ఓ భారతీయ యువకుడు కాల్పులకు బలయ్యాడు. పంజాబ్కు చెందిన విక్రమ్ జర్యాల్ (26) అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం.. యకిమా నగరంలో హత్యకు గురయ్యాడు. యువకుడు పనిచేస్తున్న ఏఎం-పీఎం గ్యాస్ స్టేషన్కు తుపాకులతో వచ్చిన ముసుగు దొంగలు విక్రమ్ ను డబ్బు డిమాండ్ చేశారు. దుండగుల బెదిరింపులు అక్కడ సాధారణం కావడంతో.. కౌంటర్లో ఉన్న సొమ్మును తీసుకొచ్చి ఇచ్చాక ఆ డబ్బును తీసుకున్న దుండగులలో ఒకరు.. విక్రమ్పై కాల్పులు జరిపి పారిపోయారు.
తీవ్ర గాయాలపాలైన విక్రమ్ను ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పోందుతూ ఆయన కొద్దిసేపటికే మరణించాడు. అయితే ఘటనాస్థలానికి చేరుకున్న తమకు ఏం జరిగిందన్న విషయాన్ని చెప్పిన విక్రమ్.. కొద్దిసేవపటికే మరణించాడం బాధకరమని పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. భారత్ లోని పంజాబ్ రాష్ట్రం హోషియాపూర్ జిల్లాకు చెందిన విక్రమ్.. నెల రోజుల క్రితమే అమెరికాకు వెళ్లాడని అతని పెద్ద సోదరుడు తెలిపారు.
కాగా ఇది జాత్యహంకార దాడేనని అమెరికాలోని భారతీయులు ఆరోపిస్తున్నారు. విక్రమ్ హత్య విషయాన్ని తెలుసుకున్న భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్.. విక్రమ్ హత్యను తీవ్రంగా ఖండించారు. అదే సమయంలో భాదిత కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తమ సోదరుడి బౌతికఖాయాన్ని స్వగ్రామానికి తీసుకురావడంలో సహకరించాలని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. విక్రమ్ మృతదేహాన్ని భారత్కు రప్పించేందుకు అన్ని విధాలా సాయం అందిస్తామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more