శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎట్టకేలకు వెనక్కు తగ్గారు. ఎయిరిండియా మేనేజరుపై దాడి నేపథ్యంలో తనపై కేసు పెడతామన్నా బెట్టు వీడని ఎంపీ.. అవును ఒక్కటి కాదు పాతికసార్లు చెప్పుతో కొట్టాను.. నాపై ఇప్పటికే అనేక కేసులు వున్నాయి. అందులో ఇది ఒకటి అవుతుందంటూ.. రేపో, మాపో రిటైర్ కాబోతున్న వ్యక్తిపై ప్రతాపాన్ని చూపిన గైక్వాడ్.. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరిపై దాడి చేయలేదని అన్నారు. ఎయిరిండియా సిబ్బందే తనను అవమానపర్చినట్లు పార్లమెంటులో చెప్పుకోచ్చారు.
ఎయిరిండియా సహా పలు ప్రైవేటు విమాన సంస్థలు కూడా రవింద్ర గైక్వాడ్ చర్యను ఖండిస్తూ.. అతను విమానంలో ప్రయాణించేందుకు వీలు కల్పించకుండా అతనిపై బ్యాన్ విధించింది. దీంతో స్పెషల్ చార్టెర్డ్ ప్లైట్ లో పూనే నుంచి ఢిలీకి వచ్చి ఆయన పార్లమెంట్ సెషన్ కు హాజరయ్యారు. అప్పటికే రవీంద్ర గైక్వాడ్ ను ఎయిర్ ఇండియా విమానాలలో ప్రయాణించే విషయమై, అతనిపై బ్యాన్ విధించడంపై పార్లమెంట్ లో శివసేన ఎంపీలు నిరసన తెలిపారు. దీనిపై వాయిదా తీర్మానం కోరారు.
తమ పార్లమెంటు సభ్యుడు గైక్వాడ్ పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావడానికి స్పెషల్ చార్టర్డ్ ప్లేన్ తీసుకొని రావాల్సి వచ్చిందని.. దీనిపై చర్చ జరగాలని శివసేన డిమాండ్ చేశారు. దీంతో గైక్వాడ్ లోక్ సభలో తన వివరణ ఇచ్చేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ అంగీకరించారు. ఈ సందర్భంగా వివరణ ఇచ్చిన గైక్వాడ్ తాను ఎయిరిండియా విమాన సిబ్బంది పట్లు అమార్యాదగా వ్యవవహరించలేదన్నారు. వారే తనను అవమానించారని పేర్కోన్నారు.
తాను నరేంద్రమోడీగా భావిస్తున్నారా..? అంటూ చులకన చేశారని, తాను పోందిన బిజినెస్ క్లాస్ టిక్కెట్ బదులు ఎకానమీ క్లాసులో ప్రయాణం చేయాలని చెప్పడం కూడా వారి అవమానంలో భాగమేనని అన్నారు. ఎయిరిండియా అధికారులే తప్పులు చేసిన.. తనను రెచ్చగోట్టింది చాలక.. తనపై నిషేధం విధించడం నిజంగా విడ్డూరమని అన్నారు. ఇక ఈ విషయంలో మీడియా కూడా అతి చేసిందని గైక్వాడ్ అన్నారు. అయితే యావత్ ఘటనపై స్పందించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోకగజపతి రాజు.. ఎయిరిండియా ప్రభుత్వ రంగ సంస్థ అని.. అటు ప్రయాణికులతో పాటు ఇటు ఉద్యోగుల విషయంలోనూ తాము తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. మరీ ముఖ్యంగా భద్రత విషయంలో ఎట్టి పరిస్తితుల్లో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more