మొగల్తూరు ఘటనపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ స్పందించారు. రసాయనాల ట్యాంకు శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ఐదుగురు కార్మికులు మృతి చెందిన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని ఆక్వాఫుడ్ ప్రాసెసింగ్ పార్కులో చోటు చేసుకున్న ఈ ఘటనలో యావత్ తప్పిదం యాజమాన్యానిదేనని అన్నారు. పరిశ్రమలు నిబంధలను పాటించకపోవడం వల్లే కార్మికులు ప్రమదాల బారిన పడి అసువులు బాస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ బాధితులతో ముఖాముఖి నిర్వహించి వారి బాధలను అడిగి తెలుసుకున్న ఆయన.. తిరిగు ప్రయాణానికి పయనమవుతూ మొగల్తూరు ఘటనపై మీడియాతో మాట్లాడుతూ.. పరిశ్రమ యాజమాన్యాలు నిబంధలను పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని మండిపడ్డారు. నిబంధనలు పాటించి వుంటే ప్రమాదాలు జరిగేవి కాదని చెప్పారు. ఇలాంటి ఘటనలపై ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలని, లేకపోతే మున్ముందు మరిన్ని దారుణ ఘటనలు వెలుగుచూసే ప్రమాధముందని ఆయన భయాందోళన వ్యక్తం చేశారు.
ప్రజలు ప్రాణాలంటే ఎవరీకీ లేక్కలేకుండా పోయిందని, మరీ ముఖ్యంగా పేదలు, సామాన్యులు ప్రాణాలకు విలువలేకుండా పోతుందని ఆయన అందోళన వ్యక్తం చేశారు. రాజకీయ జోక్యానికి తలొగ్గకుండా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఘటనపై చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాన్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని, మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more