దశాబ్దాల తరబడి ఓ సమస్య ఓ వర్గం ప్రజలను పట్టిపీడుస్తుంది. దానిని పరిష్కరించాలంటే.. రాష్ట్ర ప్రజల్లో మంచి ఫాలోయింగ్ వున్నవారు కొంత మేరకు దోహదం చేస్తారన్న అశ, ఆకాంక్షతో.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తొలుత రాజకీయ విమర్శలకు తావిచ్చినా.. ఇప్పుడు మాత్రం ఆ వర్గం సమస్యలను ప్రజల దూరం చేసేందుకు దోహదం చేస్తుందంటూ కితాబులు వ్యక్తం అవుతున్నాయి. అ వర్గం ప్రజలు ఎవరో కాదు.. అగ్గిపెట్లలో అరమగలిగిన పట్టుచీరలను నెగ్గగల సామార్థ్యం వున్న నేతన్నలు. దశాబ్దాలుగా మగ్గాలను నమ్ముకుని.. ప్రజల నుంచి అదరణ కరువై.. చేతినిండా పనిలేక.. పూట తిండికి కూడా అలమటిస్తున్న వర్గమది.
ఇలాంటి వర్గానికి చేయుత ప్రభుత్వం కల్పించినా.. ప్రజల్లో బలమైన వ్యక్తులు ముఖ్యంగా ప్రజలు అధరించే సినీనటులు చెబితే తప్ప కొనుగోళ్లు ఊపందుకోవని తలచిన రాష్ట్ర ప్రభుత్వం.. యువతలో మంచి ఫాలోయింగ్ వున్న టాలీవుడ్ నటి సమంతను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. ఈ తరుణంలో పలు విమర్శలు, అరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే వాటిని తోసిరాజుతూ.. చేనత ప్రచారకర్త సమంత ఏకంగా క్షేత్రస్థాయిలో చేనతల సమస్యలను, ఇబ్బందులను తెలుసుకునేందుకు అమె పర్యటించడం ఇప్పుడు ఆ వర్గం ప్రజల్లో కొత్త అశలను చిగురింపజేసింది.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ యువనేత.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమంత క్షేత్రస్థాయిలో పర్యటించడపై అభినందనలు తెలుపుతూ ఇది శుభారంభాన్ని అందిస్తుందని అకాంక్షిస్తూ ట్విట్ చేశారు. చేనేతను ప్రోత్సహించేలా సమంత ముందడుడు వేయడం అభినందనీయమన్నారు. చేనేత కార్మికులు ఎదుర్కోంటున్న వాస్తవ పరిస్థితులను, సమస్యలను, ఇబ్బందులను తెలుసుకునేందుకు అమెకు క్షేత్రస్థాయి పర్యటన చాలా దోహదం చేస్తుందని పేర్కోన్నారు. దుబ్బాక, పోచంపల్లిలో సమంత పర్యటించడం శుభపరిణామాని కేటీఆర్ ట్విట్ చేశారు.
Good start @Samanthaprabhu2 Understanding the nuances & real issues faced by Handloom weavers with your field tours to Dubbak & Pochampalli
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more