సుమారు పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకుని విజయ దుందుభి మోగించింది కాంగ్రెస్. దీంతో 75 ఏళ్ల కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ తోసహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. చండీగఢ్ లోని రాజ్ భవన్ లో ఉదయం పది గంటలకు గవర్నర్ దగ్గరుండి వారిచే ప్రమాణం చేయించాడు.
ఆయనతో పాటు మరో తొమ్మిది మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఉన్నారు. ప్రమాణం చేసిన అనంతరం సిద్దూ కెప్టెన్ కాళ్లకు మొక్కటం హైలెట్ అయ్యింది. ఇక అమరీందర్ కేబినెట్లో మన్ ప్రీత్ సింగ్ బాదల్, చరణ్ జిత్ సింగ్ చన్నీ, సాధు సింగ్ దరమ్ సోత్ తదితరులు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 77 స్థానాలను కైవసం చేసుకోగా, ఆప్ 20, అకాలీదళ్, బీజేపీల కూటమి 15 స్థానాల్లో గెలిచిన విషయం విదితమే. అమరీందర్ గతంలో 2002-2007 మధ్య కాలంలో సీఎంగా పని చేశాడు కూడా.
సిద్ధూకి హ్యాండిచ్చారా?
రాజ్యసభ సభ్యత్వం, బీజేపీకి గుడ్ బై చెప్పిన సిద్ధూ అనంతరం కొత్త పార్టీ పెట్టడం, కొన్నాళ్లకు ఆమ్ ఆద్మీ పార్టీలో ఆయన చేరతారని అనుకోవడం వంటి ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే ఎవరి ఊహకు అందకుండా చివరకు ఆయన కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నాడు. ఆ సమయంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేయడంతోనే పార్టీ లో చేరారని విశ్లేషకులు భావించారు. కానీ సీన్ అలా లేదు. ముఖ్యమంత్రితో పాటు ప్రమాణ స్వీకారం చేసిన తొమ్మిదిమంది మంత్రుల్లో ఆయన ఉన్నప్పటికీ, డిప్యూటీ సీఎం పదవి మాత్రం దక్కలేదు. అయితే సిద్ధూకి ఆ పదవి గనుక ఇవ్వకపోతే ఆందోళన తప్పదని కాంగ్రెస్ లోని ఆయన మద్ధతుదారులు హెచ్చరించారు కూడా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more