పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఓటరు నాడి సుస్పష్టమైంది. ముందునుంచి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేస్తున్నట్లుగానే పంజాబ్ లో కాంగ్రెస్ హావా కొనసాగుతోంది. అధికార అకాళీదళ్, బీజేపి కూటమిని అక్కడి ఓటర్లు ప్రతిపక్ష స్థానానికి మాత్రమే పరిమితం చేశారు. దశాబ్ద కాలం తర్వాత పంజాబ్లో మళ్లీ కాంగ్రెస్ గాలి వీస్తోంది. అకాలీదళ్ కోటను బద్దలు కొట్టి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. మొత్తం 117 స్థానాలకు గానూ ఇప్పటికే అక్కడ ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ 59 స్థానాలను దాటుకుని విజయం వైపునకు ప్రయాణిస్తోంది.
కాగా ఈసారి ఎలాగైనా తమ పొరుగు రాష్ట్రంలో పాగా వేయాలని భావించిన ఢిల్లీ అధికార పార్టీ ఆమాద్మీ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. అయితే పంజాబ్లో ఇప్పటివరకు అధికారంలో ఉన్న అకాలీదళ్ పార్టీకి గట్టిపోటీ ఇచ్చింది. కాగా కాంగ్రెస్ విజయం కోసం తీవ్రంగా శ్రమించిన ఆ పార్టీ పంజాబ్ చీఫ్ అమరీందర్ సింగ్ మాత్రం వెనుకబడ్డారు. ప్రస్తుత సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్పై పోటీ చేసిన ఆయన ఓట్ల లెక్కింపు సందర్భంగా మధ్యలో పుంజుకుంటున్నట్టు కనిపించినప్పటికీ... బాదల్ ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోంది.
లుధియానాలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. 117 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ గట్టి బందోస్తు నడుమ ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ దూసుకు పోతోంది. రెండోస్థానానికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), అకాలీదళ్-బీజేపీ కూటమి పోటీ పడుతున్నాయి. బీజేపీ అబోహర్ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. పంజాబ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 59 స్థానాలు అవసరం.
* అమృత్ సర్ ఈస్ట్: నవజ్యోత్ సింగ్ సిద్ధూ ముందంజ
* పాటియాల: కెప్టెన్ అమరీందర్ సింగ్ కు 3500 ఓట్ల ఆధిక్యం
* బాట్లా: ఆధిక్యంలో ఆప్ అభ్యర్థి గుర్ ప్రీత్ సింగ్
* అబోహర్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సునీల్ జకహర్ వెనుకంజ
తొలి ఆధిక్యాలు
కాంగ్రెస్- 60
ఆప్- 25
అకాలీదళ్-బీజేపీ-29
ఇతరులు-1
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more