ఎవరి సంగతి ఏమోగానీ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మజ్లిస్ తో మాత్రం మాంచి దోస్తీ కొనసాగించటం చూస్తూ ఉంటాం. విమర్శలు, ప్రత్యారోపణల సంగతి పక్కనబెట్టి ఆ పార్టీ నేతలతో కలివిడిగా మెలుగుతుంటాడు. ఆ చొరవతోనే లోకల్ బాడీలో 141 మంది సభ్యులున్న పార్టీకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు కట్టబెట్టేందుకు రెడీ అయ్యాడు కూడా. ప్రతిపక్షం నుంచి ఎలాంటి పోటీ లేకపోయినా భవిష్యత్తులో పరోక్ష మిత్రపక్షంగా ఎంఐఎం ను కొనసాగించాలన్న ఉద్దేశ్యంతోనే కేసీఆర్ ఈ పని చేస్తున్నాడని స్పష్టం అవుతుంది.
అయితే ఈ లోపాయికారి ఒప్పందం సంగతి ఏమోగానీ, అధికార పక్షం అని కూడా చూడకుండా పైకి కఠువుగా వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది ఎంఐఎం. పార్టీ కేంద్ర కార్యాలయం దారుస్సలాంలో గురువారం జరిగిన ఎంఐఎం 59వ వార్షికోత్సవ సభలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రితో క్షమాపణ చెప్పించిన ఘనత ఒక్క మజ్లిస్ పార్టీదేనంటూ ఆ పార్టీ శాసనసభాపక్ష నేత పేర్కొన్నాడు.
యావత్ ముస్లింల చూపు దారుస్సలాం రాజకీయాలపైనే ఉందని, అక్బరుద్దీన్ వాళ్లకు ఎక్కడ అన్యాయం జరిగినా గళం విప్పి న్యాయం జరిగే వరకు పోరాడుతున్నట్టు పేర్కొన్నాడు. మక్కామసీదు ఘటనలో నిరపరాధులకు న్యాయం చేసి అప్పటి ముఖ్యమంత్రితో క్షమాపణలు చెప్పించామని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ఆలేరు ఎన్కౌంటర్ బాధ్యులను జైలుకు పంపి తీరుతామని, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేందుకు ఇందుకోసం ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమని ప్రకటించాడు.
ఇక చివర్లో జాతీయ రాజకీయాల గురించి టచ్ అప్ ఇస్తూ... ఇప్పటి వరకు రాజకీయాల్లో రెడ్డి, రావు, మారాఠా, బహుజనులు, లింగాయత్, యాదవులు తమ వాణి వినిపించారని, ఇప్పుడు గాడిదలు కూడా మాట్లాడుతున్నాయంటూ పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. గాడిదలపై రాజకీయాలు జరగడం విడ్డూరంగా ఉందన్న అక్బర్ రాజకీయాలు రోజురోజుకు మరింత దిగజారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more