సరిహద్దులో మళ్లీ ఉగ్ర అలజడి.. మళ్లీ ముష్కరుల దొంగదెబ్బ Shopian: 3 Jawans Killed, 6 Injured in Terrorist Ambush in J&K

3 jawans woman killed in terrorist attack on patrolling party in jk s shopian

terror attack, Shopian, 3 jawans killed, pakistan terrorists, terrorist attack, terrorist attack in jammu and kashmir, kashmir attack, shopian attack, j and k news, jammu and kashmir news

Three jawans and a woman were killed after terrorists attacked a patrolling party in Shopian district of Jammu and Kashmir, according to TV reports. Four other army personnel were injured in the ambush.

సరిహద్దులో మళ్లీ ఉగ్ర అలజడి.. 3 జవాన్లు సహా నలుగురు మృతి

Posted: 02/23/2017 09:12 AM IST
3 jawans woman killed in terrorist attack on patrolling party in jk s shopian

దేశ సరిహద్దులో మళ్లి ధాయాధి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూకశ్మీర్ షోపియన్‌ వద్ద కూంబింగ్ చేస్తున్న జవాన్లను టార్గెట్ గా పిరికి పందల్లా దొంగదెబ్బ తీశారు. ఇవాళ తెల్లవారుజామున జవాన్లపై ఉగ్రవాదులు అకస్మికంగా కాల్పులకు తెగబడి నలుగురు ప్రాణాలను బలితీసుకున్నారు. వీరిలో ముగ్గురు జవాన్లు వుండగా, స్థానికురాలైన ఓ మహిళ కూడా కాల్పులలో ప్రానాలను విడిచింది.  కాగా, ఉగ్రవాదుల కోసం భారత షైనికులు రంగంలోకి దిగి ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే ఇవాళ తెల్లవారుజామున జమ్మూకాశ్మీర్ లోని షోఫియన్ జిల్లాలో సరిహద్దు ప్రాంతం నుంచి చోరబాట్లు కళ్లెం వేస్తూ కూంబింగ్ చేస్తున్న జవాన్లను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు.. అక్కడ మాటు వేసి.. అకస్మికంగా దాడులకు తెగబడ్డారు. నియంత్రణ రేఖ వద్ద జరిగిన ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అమరులు కాగా, మరో స్థానికురాలైన మహిళ కూడా ప్రాణాలను విడిచింది. కాగా, ఈ ఘటనలో గాయపడిన  ఆరుగురు జవాన్లలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా వుందని అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

కాగా, గత రెండు నెలల కాలంలో సరిహద్దు ప్రాంతంలో ముఖ్యంగా నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వహిస్తున్న 26 మంది భారత జవాన్లు ఉగ్రవాద దొంగదెబ్బల కారణంగా ప్రాణాలను విడిచారని అధికారులు తెలిపారు. ఈ ఏడాదిలో గడిచిన రెండు మాసాల్లో ఇంత మంది సైనికులు అమరులు కావడం అందోళన కలిగిస్తుంది. కాగా, భారత్ కూడా ఉగ్రవాదుల పీచమణుచుంది. గత రెండు మాసాలుగా 22 మంది ఉగ్రవాదుల ప్రాణాలను హరించింది. ఇదిలావుండగా, గత నెలలో మంచుతుపానులో చిక్కకుని 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu kashmir  poshiyan  terror attack  Shopian  3 jawans killed  pakistan  

Other Articles