ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యర్థులకు భిన్నంగా తమదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహించుకుంటూ ముందుకు సాగుతున్న యువనేతలు తమ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, శ్రేయోభిలాషులకు కూడా అదే క్రమంలో జోష్ పెంచాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఎప్పటినుంచే వస్తున్న అనవాయితీనే వారు కూడా వాడుకుంటున్నారు. భారతీయ ఓటర్లకు ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ ఓటర్లకు గాలం వేసేందుకు తాజాగా హిట్ సినిమాలను తమ ప్రచారంలో భాగంగా వినియోగిస్తుండటంలో పార్టీ క్యాడర్ కూడా జోష్ గా పనిచేస్తుందంటున్నాయి పార్టీ వర్గాలు
పాటలంటే సహజంగానే అందరకీ ఇష్టమని.. ఆ ఇష్టాన్ని తమవైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాటలనే ఆయుధంగా చేసుకోని ఎన్నికల ప్రచారాన్ని అదరగొడుతున్నారు. పార్టీ బహిరంగ సభలు, ర్యాలీలతో పాటు వారు వెళ్లే ప్రతీ చోట.. దీంతో పాటు తమ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసిన ప్రతీ చోట ఈ పాటలనే అయుధంగా మలచి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇందుకోసం బాలీవుడ్ పాటల రచయితలను కూడా రంగంలోకి దింపేశారు.
‘యే దిల్ హై ముష్కిల్’లో హిట్ పాటలు పాడిన అమిత్ మిశ్రాతో ఎన్నికల ప్రచారం టైటిల్ సాంగ్ ‘యే హు నా బాత్’ పాడించారు. ‘తను వెడ్స్ మను’ సినిమాకు పాటలు రాసిన రాజశేఖర్తో ఈ టైటిల్ సాంగ్ను రాయించారు. ఎందుకు వీరిద్దరు కలిశారు? వీళ్లను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షానికి ఎందుకు కష్టం అంటూ సాగే వీడియో పాటలో ఒకే వేదికపై రాహుల్, అఖిలేష్ చేతులు కలుపుకోవడం, ప్రజలకు అభివాదం చేయడం, సభలకు హాజరైన అశేష జనాన్ని ఉద్దేశించి ప్రసంగించడం లాంటి చిత్రాలను జోడించారు. సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’ సినిమాలోని ‘బేబీ కో బస్ పసంద్ హై’ పాటను స్ఫూర్తిగా తీసుకొని రాసిన మరో పాట‘సైకిల్ కో హాత్ పసంద్ హై, యూపీ కో ఏ సాత్ పసంద్ హై’ను కూడా ఎన్నికల ప్రచారంలో విరివిగా ఉపయోగిస్తున్నారు.
ఇప్పుడు ఈ రెండు పాటలు యూట్యూబ్లో చక్కెర్లు కొడుతున్నాయి. ఇంతకుముందు ‘యూపీకో అఖిలేష్ పసంద్ హై’ అంటూ పాట కొనసాగగా ఇప్పుడు దానికి రాహుల్ కాంబినేషన్ను కలిపారు. మొదటి నుంచి కూడా సమాజ్వాది పార్టీ పాటల ద్వారా ఎన్నికల ప్రచారం సాగించేది. గతంలో ‘మన్సే హై ములాయం’ అనే పాట బహుళ ప్రాచుర్యం పొందింది. ‘వియ్ డిడంట్ స్టార్ట్ ది ఫైర్’ అనే బిల్లి జోయల్ పాడిన పాటను స్ఫూర్తిగా తీసుకొని ఆ పాటను రాశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more