అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారని వస్తున్న కథనాలపై జయలలిత మేనకోడలు దీపాకుమార్ స్పందించారు. 'ఇండియా టుడే'తో మాట్లాడిన ఆమె శశికళ తీరు సైనిక కుట్రను తలపిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నవారిని మార్చి తాను అకస్మాత్తుగా పగ్గాలు చేపడితే.. దానిని ప్రజలు ఒప్పుకోబోరని ఆమె పేర్కొన్నారు. సీఎం పన్నీర్ సెల్వాన్ని గద్దె దించి శశికళ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్నారని, ఇందుకోసమే ఆదివారం అన్నాడీఎంకే ఎమ్మెల్యేల కీలక భేటీ నిర్వహించబోతున్నారని కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ కథనాలపై దీప స్పందించారు. ఈ విషయంలో పలు కథనాలు వస్తున్నాయని, అయినా అన్నాడీఎంకే తుది నిర్ణయం తీసుకునేవరకు వేచిచూడటం మంచిదని చెప్పారు. సీఎంగా శశికళ పగ్గాలు చేపట్టబోతున్నారన్న వార్తలపై స్పందిస్తూ.. 'ఇలా జరగాలని ప్రజలు కోరుకోవడం లేదు. తమిళనాడు ప్రజలకు అంతతి దుస్థితి వస్తుందని నేను కూడా అనుకోవడం లేదు. ఇది చాలా తప్పుడు నిర్ణయం. ప్రభుత్వాన్ని సైనిక కుట్రతో కూల్చడం లాంటిదే. ఆమె ప్రజాస్వామికంగా ఎన్నుకోబడిన నేత కాదు' అంటూ పేర్కొన్నారు. జయలలిత సలహాదారు అయిన షీలాబాలకృష్ణన్ ను పక్కా ప్లాన్తోనే పదవి నుంచి తప్పించారని ఆమె ఆరోపించారు.
మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రిగా వీకే శశికళ ప్రమాణ స్వీకారం చేస్తే, రాష్ట్రానికి అంతకన్నా అసహ్యకరమైనది మరొకటి ఉండదని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి విమర్శించారు. "శశికళ సీఎంగా అవకుండా చేయడానికి ఎలాంటి నిషేధమూ లేదు. అయితే, ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నాయి. ఆమెపై సుప్రీంకోర్టులో అక్రమాస్తుల కేసు విచారణలో ఉంది. ఓ నిందితురాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమేంటి? రాష్ట్రానికి మళ్లీ ఎన్నికలు వచ్చేలోగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో పదవిని చేపట్టడం రాష్ట్రానికి మంచిది కాదు" అని ఆయన అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more