2017-18 వార్షిక బడ్జెట్ సు పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగిస్తూ..ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఆర్థిక వ్యవస్థ ముందు మూడు సవాళ్లు ఉన్నాయని అరుణ్జైట్లీ అన్నారు. అమెరికా ఫెడరల్ వడ్డీరేట్లు పెంపు, ముడిచమురు ధరల పెరుగుదల, రక్షణాత్మక వైఖరివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా మారాయని ఆయన అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయని, విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరిగాయని అరుణ్జైట్లీ పేర్కొన్నారు.
మోదీ హయాంలో దేశ వృద్ధిరేటు పెరిగిందని, వృద్ధిరేటు, యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని అరుణ్జైట్లీ చెప్పారు. తాము పాలనలో పారధర్శకతను తీసుకువస్తున్నామని చెప్పుకోచ్చారు. పరిపాలనలో సమూల మార్పులు తేవడమే తమ లక్ష్యమని అన్నారు. పారదర్శమైన పాలనను తీసుకురావడంతో పాటు ద్రవ్యోల్బణం తగ్గించామన్నారు. తొమ్మిది శాతంగా వున్న ద్రవ్యోల్భణాన్ని ఆరుకు తీసుకువచ్చామని అన్నారు. దేశం నుంచి నల్లధనాన్ని పారద్రోలేందుకు పాత పెద్ద నోట్ల రద్దుతో పాటు పలు చర్యలు తీసుకున్నామని ప్రకటించారు.
ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాల నేపథ్యంలో బ్యాంకుల దగ్గర విపరీతంగా నిధులు ఉన్నాయన్నారు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. వడ్డీరేట్లు తగ్గడం వల్ల పారిశ్రామిక రంగం పుంజుకుంటుందన్నారు. రైతులు, వ్యవసాయ, గృహ రుణాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ముద్ర యోజన కింద ఇచ్చే రుణాలకు వడ్డీ రేట్లు తగ్గుతుందని తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 7.2 శాతం వృద్ధిరేటు ఉంటుందని ఐఎంఎఫ్ చెప్పిందని తెలియజేశారు. దీంతో ముద్ర రుణాలను మరింత పెంచేందుకు నిధులను రెట్టింపు చేస్తామని చెప్పారు.
పబ్లిక్ సర్వీస్లో ప్రజలను భాగస్వాములను చేస్తామన్నారు. పన్నుల్లో సంస్కరణలు తమ లక్ష్యమని చెప్పారు. ఫలితంగా ఐదేళ్లలో వ్యక్తుల ఆదాయం రెట్టింపవుతుందని జైట్లీ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు, పథకాలు పేదలకు చేరటం, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ ఎకానమీ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను జియో ట్యాగింగ్ చేస్తామని జైట్లీ పేర్కొన్నారు. ఉపాధి హామీ పనులను శాటిలైట్లతో పర్యవేక్షిస్తామన్నారు.
అలాగే ఉపాధి హామీ పథకానికి రూ.48వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గత బడ్జెట్ లో రూ.38వేల కోట్లు కేటాయించగా ప్రస్తుతం 48వేల కోట్లకు పెంచామన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.3లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని, 2019 నాటికి 50వేల గ్రామ పంచాయతీల్లో పేదరికాన్ని అరికడతామని జైట్లీ పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన పథకాలను పంచాయతీలే పర్యవేక్షించవచ్చన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 5లక్షల పంట కుంటలు ఏర్పాటు చేశామని, ఈ ఏడాది మరో 5లక్షల పంటకుంటల తవ్వకం జరుపుతామని జైట్లీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more