నేటి బాలలు రేపటి పౌరులు అన్న మాటలో అర్థం ఏంటో కూడా తెలియని బాలురు. అయితే తమ తవసరాలకు డబ్బుకోసం దారుణానికి ఒడిగట్టారు. స్నేహితులే కదా అని వారు చెప్పినట్టలా చేసిన 8వ తరగతి విద్యార్థికి చిట్టచివరి వారి చేతిలో చిక్కుకుపోయాడు. అగిడినప్పుడల్లా డబ్బు, దస్కాం ఇవ్వకపోతే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. తన కొడుకులో వస్తున్న మార్పులను సునితంగా గమనించిన తండ్రి ఎట్టకేలకు విషయాన్ని తెలుసుకుని బాలల హక్కు కమీషన్ ను అశ్రయించాడు.
కాలం మారుతుంది.. రేపటి తరం కూడా శరవేగంగా మారుతుంది. అందివచ్చిన సాంకేతిక విప్లవాన్ని అయినదానికి, కానీదానికి వినియోగించే తల్లిదండ్రులను చూస్తూ పిల్లల్లో కూడా పెను మార్పులను తీసుకువస్తుంది. తెల్లవారగానే దేవుడి నామస్మరణ చేస్తూ నిద్ర నుంచి లేచే గత తరం నుంచి నిద్ర లేస్తూనే సెల్ ఫోన్ లో సోషల్ మీడియాను ఫాలో అవ్వతున్న నేటి తరానికి ఎంత మార్పు వుందో కానీ.. రేపటి తరం మాత్రం మరింత వేగంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటుందనడానికి ఈ ఘటనే నిదర్శనం.
హైదారబాద్ ఓల్ట్ మలక్ పేట్ లోని జమాల్ కాలనీకి చెందిన 8వ తరగతి విద్యార్థి బ్లాక్ మెయిల్ చేసిన కేసులో స్థానికంగా వున్న మెస్కో గ్రేడ్ స్కూల్ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులపై చాదర్ ఘాట్ పోలిస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 8వ తరగతి విద్యార్థిని బలవంతంగా నగ్నంగా మార్చడంతో పాటు తన సహచరుడితో సెక్స్ లో పాల్గోనేలా బలవంతపెట్టారు తోటి విద్యార్థులు. అతడు నగ్నంగా మారిన తరుణంలో అతనికి తెలియకుండా ఫోటోలను, వీడియోలను తీశారు.
ఆ తరువాత అడిగినప్పుడల్లా తమకు డబ్బు ఇవ్వాలని, లేని పక్షంలో తమ వద్దనున్న ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదింపులకు గురిచేశారు. దీంతో పలుమార్లు ఇంట్లో తెలియకుండా డబ్బులను తీసుకువెళ్లిన విద్యార్థి.. మానసికంగా వేదనకు లోనయ్యాడు. తన కొడుకులో వస్తున్న మార్పులను గమనించిన తండ్రి.. తీరా విషయం తెలుసుకున్నాడు. దీంతో బాలల హక్కుల కమీషన్ ను కలిశాడు. వారి సూచన మేరకు చాధర్ ఘాట్ పీఎస్ లో కేసు నమోదు చేశాడు. అయితే నేరానికి పాల్పడిన మైనర్ విద్యార్థులను మాత్రం ఇంకా అదుపులోకి తీసుకోలేదని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more