ప్రముఖ, అమెరికన్ పాప్ సింగర్, గ్రేట్ డ్యాన్సర్ మైఖెల్ జాక్సన్ ఓవర్ డోస్ మందులు వాడటం వల్ల చనిపోయాడని దాదాపుగా ఏడేళ్లుగా యావత్ ప్రపంచం బావిస్తున్న నేపథ్యంలో తన తండ్రిది ముమ్మాటికీ హత్యేనని.. ఆయనను ఓ పథకం ప్రకారం హత్య చేశారని ఆయన కూతురు ప్యారిస్ జాక్సన్ ఆరోపించారు. 2009లో తన తండ్రి చనిపోయిన సమయంలో జరిగిన పరిణామాలన్నీ కూడా ఒక సెటప్ అని, ఆ రోజు ఓ కట్టుకథ చెప్పి తన నోరు మూయించారని చెప్పుకోచ్చింది. తొలిసారి రోలింగ్ స్టోన్ అనే మ్యాగజీన్ కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనైన అమె తనను కూడా చంపేస్తారని అందోళన వ్యక్తం చేసింది.
తన తండ్రి మాదిరిగానే తనను కూడా గుట్టుచప్పుడు కాకుండా చంపేస్తారని, తన మరణంపై కూడా ఓ కట్టుకథ చెప్పి ప్రపంచాన్ని నమ్మిస్తారని భయాందోళన వ్యక్తం చేసిన అమె.. ఇందులో భాగంగా తాను 18 ఏళ్ల వయస్సులో వుండగా తనపై గుర్తుతెలియని అగంతకుడు లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడని చెప్పింది. లైంగిక దాడికి సంబంధించిన వివరాలను ఇంతకుమించి తాను వెల్లడించలేనని చెప్పిన పారిస్ జాక్సన్.. దాని నుంచి తాను కోలుకోవడానికి ఏడాది పాటు ఉతాహ్ లో చికిత్స పోందానని చెప్పింది.
శక్తిమంతమైన అనాస్తెటిక్ ప్రొపొఫోల్ ఓవర్ డోస్గా తీసుకోవడంవల్లే మైఖెల్ జాక్సన్ చనిపోయాడని అందరూ భావిస్తున్నా.. జాక్సన్ కూతురు ప్యారిస్ జాక్సన్ మాత్రం జనాలను తప్పుదోవ పట్టించేందుకు అలా ఓవర్ డోస్ అంటూ చెప్పారని, వాస్తవానికి తన తండ్రిని చంపేశారని, తనను కూడా ఏదో ఒకరోజు హత్య చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ మాత్రం అనుమానం లేకుండా తన తండ్రి హత్యకు గురయ్యాడని, ఇదంతా కూడా ఒక పెద్ద కుట్ర అని.. జాక్సన్ కుటుంబ సభ్యులకు ఆయన అభిమానులకు ఈ విషయాలు తెలుసని, ఆరోజు జరిగిందంతా కూడా ఓ సెటప్ అని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more