ప్రధాని మోదీ తమ కార్యకర్తలను, తన అభిమానులను ’సెన్స్ ఆఫ్ హ్యుమర్’ పెంచుకోమని చెప్తే.. ఆయన భక్తులు మాత్రం ’సెన్స్ ఆఫ్ రూమార్’ను పెంచుకుంటున్నారని అమ్ అద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ ఎద్దేవా చేశారు. తాను అప్ నుంచి బీజేపి పార్టీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు రావడంతో.. ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆప్ అధినేత అరవింద్ క్రేజీవాల్కు అత్యంత నమ్మకస్తుడైన కుమార్ విశ్వాస్ పార్టీని వీడి.. బీజేపీలోకి జంప్ చేయబోతున్నారన్న వార్త ఇవాళ ఉదయం నుంచి అటు సోషల్ మీడియాతో పాటు ఇటు జాతీయ పోర్టల్స్ లోనూ పెను సంచలనంగా మారింది.
యూపీ ఎన్నికల్లో ఆయన బీజేపీ టికెట్ మీద పోటీ చేస్తారని వదంతులు చెలరేగాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని షహిబాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపి టీకెట్ పై పోటీ చేయనున్నారన్న వార్తలు కూడా జోరందుకున్నాయి, సోషల్ మీడియాలో గుప్పుమన్న ఈ వదంతులు మీడియా కూడా ప్రసారం చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో వాటిపై చిరాకు కలిగిన కుమార్ విశ్వాస్ మొదట తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా.. కుమార్ విశ్వాస్ కాంగ్రెస్, టీఎంసీ, అన్నాడీఎంకే, బీజేడి, జేఎంఎం, ఏజీపీ పార్టీలలో చేరుతున్నారని వ్యంగ్యంగా ట్విట్ చేశారు.
ప్
ఆ తరువాత ఇవాళ.. మరోమారు ట్విట్ చేసిన కుమార్ విశ్వాస్.. ‘విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రధాని మోదీ టీడీపీలో చేరబోతున్నారని తెలిసింది. దీనిని వార్తాకథనంగా ప్రసారం చేయండి. మీలాగే జోక్ చేస్తున్నా గైస్’ అంటూ సెటైరికల్ ట్విట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మరో అడుగు ముందుకువేసి ప్రధాని మోదీ కాంగ్రెస్లో చేరబోతున్నారని, త్వరలోనే రాహుల్ను కలుస్తారని వ్యంగ్యంగా అన్నారు. అమిత్ షా ఆప్లో చేరబోతున్నారా? అంటూ మరో ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more