గోవాలో అధికారంలో వున్న బీజేపి పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎత్తుగడ వేసింది. ఇప్పటికే మిత్రపక్షాల నుంచి షాక్ ల మీద షాకులు ఎదుర్కోని నివ్వెరపోయిన బీజేపికి అటు కాంగ్రెస్, ఇటు అప్ పార్టీల నుంచి పోటీ తీవ్రంగా వుండటంతో పాటు మిత్రపక్షాల కూటామి కూడా వేరే కుంపటి పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగి విడిగా పోటీచేయడంతో గెలుపుపై అశలు సన్నగిల్లుతున్న వేళ.. మళ్లీ మరో ఎత్తుగడ వేసింది. లక్ష్మీకాంత్ పర్సేకర్ ముఖ్యమంత్రిగా వున్న హయాంలో ప్రజలు పార్టీకి దూరమయ్యారన్న భావన కల్గించకుండా.. బీజేపి అధికారంలోకి వస్తే అంతకు ముందు ముఖ్యమంత్రిగా వున్న ప్రస్తుత రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న మనోహర్ పారికర్ పేరును పార్టీ పరోక్షంగా ప్రజల ముందు పెట్టేలా చేసింది.
ఫిబ్రవరి 4న గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో తమ భారతీయ జనతా పార్టీ గెలిస్తే మళ్లీ మనోహర్ పారికరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పరోక్షంగా చెప్పారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రచారంలో పాల్గొంటోంది. ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకుంటే ఢిల్లీలో ఉన్న ఒక నేత సీఎం అవుతారని నితిన్ గడ్కరీ మీడియాకు తెలిపారు. కొత్తగా శాసనసభకు ఎన్నికయ్యే నేతలే వారి సీఎం ఎవరో నిర్ణయిస్తారని అన్నారు. ఢిల్లీ నుంచి తాము సీఎం అభ్యర్థిని పంపిస్తామని వ్యాఖ్యానించారు. మనోహర్ పారికర్ మళ్లీ గోవా రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తారని, ఈ అంశంపై తమ అధిష్ఠానం కూడా అనుకూలంగా ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more